చాయ్‌ తాగాడు.. గ్లాసు మింగాడు!

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది.

Updated : 22 Feb 2022 11:26 IST

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. అతని కడుపులో గ్లాసు ఉందని గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు. జిల్లాలోని మడిపుర్‌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వెంటనే వైద్యులు అతనికి ఎక్స్‌-రే తీయగా.. బాధితుడి కడుపులో గ్లాసు ఉన్న సంగతి తెలిసింది. దానిని తీయడానికి మొదట ఎండోస్కోపీ ద్వారా విఫలయత్నం చేశారు. చివరకు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ విషయమై బాధితుడు మాట్లాడుతూ.. చాయ్‌ తాగేటప్పుడు గ్లాసు మింగేశానని చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని