దారుణం.. ప్రతిఘటించినందుకు హత్య.. ఆపై శవంపైనే అత్యాచారం!

అత్యాచార ప్రయత్నం విఫలం కాగా మహిళను చంపి మృతదేహాన్ని అత్యాచారం

Published : 23 Feb 2022 10:40 IST

అత్యాచార ప్రయత్నం విఫలం కాగా మహిళను చంపి మృతదేహాన్ని అత్యాచారం చేశాడో కామాంధుడు. దిల్లీ బురారీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ మేరకు 24 ఏళ్ల యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను చంపిన అనంతరం నిందితుడు అమన్‌ సింగ్‌ బిష్ఠ్‌.. మృతదేహంపై దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ నెల 19న నిందితుడి భార్య.. కాశిక్‌ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె స్నేహితురాలు అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని గమనించింది. ఆ సమయంలో ఆమె భర్త అక్కడ లేడు. ఆ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సోమవారం మహిళ భర్తను అనుమానితుడిగా భావించి అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నిజం అంగీకరించాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. 
*మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని చాంద్‌పుర్‌ గ్రామంలో అత్యాచార బాధితురాలు(19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. ఆమెపై 2019లో నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని