Corona Virus: మూడో డోసుతోనే ఒమిక్రాన్కు అడ్డుకట్ట
కొవిడ్ గత వేరియంట్ల ప్రభావం నుంచి కోలుకొని, వ్యాక్సిను రెండు డోసులు పూర్తి చేసుకొన్నా.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి
ఆస్ట్రియా పరిశోధకుల అధ్యయనం
లండన్: కొవిడ్ గత వేరియంట్ల ప్రభావం నుంచి కోలుకొని, వ్యాక్సిను రెండు డోసులు పూర్తి చేసుకొన్నా.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి యాంటీబాడీల రక్షణ అంతగా ఉండదని ఓ అధ్యయనంలో తేలింది. ‘అలెర్జీ’ జర్నల్లో ఈ పరిశోధన వివరాలు ఇటీవల ప్రచురితమయ్యాయి. కేవలం మూడో డోసు (బూస్టర్) తీసుకున్నవారిలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు మాత్రమే ఒమిక్రాన్ను కొంతవరకు అడ్డుకుంటాయని అందులో తేల్చారు. ఆస్ట్రియాలోని వియెన్నా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని, కొవిడ్ వేరియంట్ల నుంచి కోలుకున్న కొంతమంది వ్యక్తుల్లోని యాంటీబాడీల స్థాయి.. డెల్టా, ఒమిక్రాన్ తదితర వేరియంట్లపై నిరోధక సామర్థ్యం పరిశీలించారు. ఈ వ్యక్తుల్లోని యాంటీబాడీలు డెల్టాను అడ్డుకోగలుగుతున్నా, ఒమిక్రాన్ను ఆపడంలో విఫలమవుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. మూడో డోసు తీసుకొన్నవారిలో మాత్రమే ఒమిక్రాన్ను ఎదుర్కొనే సామర్థ్యం గుర్తించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు