west bengal: బెంగాల్లో.. మిడ్నైట్ అసెంబ్లీ!
పశ్చిమబెంగాల్ శాసనసభను మార్చి 7వ తేదీ అర్ధరాత్రి దాటాక.. తెల్లవారుజామున 2.00 గంటలకు సమావేశపరచాల్సిందిగా
గవర్నర్ ‘అసాధారణ’ ఉత్తర్వులు
కోల్కతా: పశ్చిమబెంగాల్ శాసనసభను మార్చి 7వ తేదీ అర్ధరాత్రి దాటాక.. తెల్లవారుజామున 2.00 గంటలకు సమావేశపరచాల్సిందిగా గురువారం రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కడ్ ‘అసాధారణ’ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు జరిగింది ఏమిటంటే.. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై గవర్నర్కు పంపిన నోట్లో ‘2 పి.ఎం.’ బదులు ‘2 ఎ.ఎం.’ అని పొరపాటున టైప్ చేశారు. సమావేశం వివరాలను గవర్నర్ ట్విటర్ ద్వారా కూడా పంచుకొంటూ.. రాష్ట్ర కేబినెట్ సమావేశం నుంచి అందిన ప్రకటన మేరకే తాను ఆదేశాలు జారీ చేసినట్లు వివరణ ఇచ్చారు.
‘రాష్ట్ర ప్రభుత్వానికి తల తిరుగుతోంది’ అంటూ ఈ ఉత్తర్వులపై ప్రతిపక్ష (భాజపా) నేత సువేందు అధికారి విమర్శించారు. టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ దీనిపై స్పందిస్తూ.. పొరపాటు జరిగిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే గవర్నర్కు సమాచారం ఇచ్చారని, అయినా కేబినెట్ పేపరును గవర్నర్ ట్విటర్లో ఎలా పోస్టు చేస్తారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. కేబినెట్ నోట్ను సవరించి ‘2 పి.ఎం.’ అని రాసి పంపేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 28న మరోమారు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు