Ukraine Crisis: యుద్ధంతో చితికిపోతున్న బాల్యం
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ఇప్పటికే 30 లక్షల మంది పొరుగుదేశాలకు
న్యూక్యాజిల్, (ఆస్ట్రేలియా): ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ఇప్పటికే 30 లక్షల మంది పొరుగుదేశాలకు శరణార్థులుగా తరలిపోవాల్సిన అగత్యాన్ని తెచ్చిపెట్టింది. మొత్తం మీద 40 లక్షలమంది ఉక్రెయిన్ వాసులు శరణార్థులుగా మారొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉక్రెయిన్ వాసులు దేశం విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించి ఉండకపోతే శరణార్థి ప్రవాహం మరింతగా పెరిగి ఉండేదని భావిస్తున్నారు. ఈ వర్గంలోని పురుషులను దేశం నుంచి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారి కుటుంబాల్లోని స్త్రీలు, పిల్లలు మగతోడు లేకుండా పొరుగుదేశాలకు వెళ్లిపోతున్నారు. ముగ్గురు లేక అంతకుమించి పిల్లలు ఉన్న పురుషులు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే సైనిక సర్వీసు నుంచి మినహాయింపు ఇస్తున్నారు. కుటుంబ పెద్ద ఉక్రెయిన్లోనే చిక్కుకుపోవడంతో పొరుగుదేశాలకు శరణార్థులుగా వెళ్లిన స్త్రీలు, పిల్లలు దిక్కులేనివారవుతున్నారు. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ పిల్లల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. 4.4 కోట్ల ఉక్రెయిన్ జనాభాలో 75 లక్షలమంది పిల్లలే. వీరిలో 15 లక్షలమంది ఇప్పటికే పొరుగుదేశాలకు తరలిపోయారు. కుటుంబ రక్షణ కొరవడుతున్న బాలలు చాలామంది అనాథలుగా మిగలనున్నారు.ఇక ఉక్రెయిన్లోనే ఉండిపోయిన పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. స్కూలు, కిండర్ గార్టెన్ భవనాలపై బాంబు దాడులు జరుగుతున్నందున పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో పిల్లలను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణం రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు