జైల్లో చదివి ఐఐటీలో ర్యాంకు.. బిహార్ కుర్రాడి ఘనత
ఓ హత్య కేసుకు సంబంధించి 11 నెలలుగా జైలులో ఉంటున్నా ఆ కుర్రాడు భవిష్యత్తుపై ఆశను కోల్పోలేదు.
ఓ హత్య కేసుకు సంబంధించి 11 నెలలుగా జైలులో ఉంటున్నా ఆ కుర్రాడు భవిష్యత్తుపై ఆశను కోల్పోలేదు. చెరసాలలోనే శ్రద్ధగా చదివి మాస్టర్స్ డిగ్రీ కోర్సు కోసం ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఐఐటీ జామ్)లో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో 54వ ర్యాంకు సాధించి ఆశ్చర్యపరిచాడు. అతడే బిహార్కు చెందిన కౌశ్లేంద్ర కుమార్ అలియాస్ సూరజ్. 22 ఏళ్ల సూరజ్ సొంతూరు నవాడా జిల్లాలోని మోస్మా. గతేడాది ఏప్రిల్ నుంచి ఓ హత్యకేసులో విచారణ ఖైదీగా ఉన్నాడు. అక్కడ ఉంటూనే చదువును కొనసాగించడంపై దృష్టిపెట్టాడు. ఇటీవలే విడుదలైన ఐఐటీ రూర్కీ ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపి సీటు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ