International Flights: ఇక మునుపటిలా ‘అంతర్జాతీయ’ గగనయానం
కొవిడ్ నుంచి తేరుకుంటున్న వేళ.. పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన
నేటి నుంచి యథావిధిగా విమానాల రాకపోకలు
దిల్లీ/ముంబయి: కొవిడ్ నుంచి తేరుకుంటున్న వేళ.. పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు గగనయానానికి సిద్ధమయ్యాయి. రెండేళ్ల తర్వాత యథావిధిగా విమానాల రాకపోకలు ఆదివారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. ఈమేరకు విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు కొవిడ్కు ముందు మాదిరిగా సర్వీసులు నడిపేందుకు సన్నద్ధమవుతున్నాయి. మహమ్మారి ప్రభావంతో ఒడిదుడుకులకు లోనైన విమానయాన పరిశ్రమ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో.. అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ ఆ రంగానికి మరింత ఊతమిస్తుంది. ఇప్పటికే భారతీయ విమానయాన సంస్థలు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా.. వివిధ విదేశీ సంస్థలైన ఎమిరేట్స్, విర్జిన్, అట్లాంటిక్, లాట్ పోలిష్, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వంటివి కూడా భారత్ నుంచి రాకపోకలకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం వివిధ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం (ఎయిర్ బబుల్) మేరకు కొన్ని విమానాలు తిరుగుతుండగా.. ఆదివారం నుంచి అన్ని రెగ్యులర్ సర్వీసులనూ నడపడానికి అనుమతిస్తూ ఈనెల 8న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు