China: చైనాకు కళ్లెం వేసేందుకు అమెరికా సమాయత్తం
ఇండో పసిఫిక్ వ్యూహాన్ని అమలు చేయడానికి 180 కోట్ల డాలర్లను, అక్కడ చైనా దూకుడును నిరోధించడానికి అదనంగా 40 కోట్ల డాలర్లనూ కేటాయించాలని అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)ను అధ్యక్షుడు బైడెన్ కోరారు.
వాషింగ్టన్: ఇండో పసిఫిక్ వ్యూహాన్ని అమలు చేయడానికి 180 కోట్ల డాలర్లను, అక్కడ చైనా దూకుడును నిరోధించడానికి అదనంగా 40 కోట్ల డాలర్లనూ కేటాయించాలని అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)ను అధ్యక్షుడు బైడెన్ కోరారు. 2023 సంవత్సరానికి 77,300 కోట్ల డాలర్ల వార్షిక రక్షణ బడ్జెట్ ప్రతిపాదనలను బైడెన్ సర్కారు కాంగ్రెస్కు సమర్పించింది. అందులో భాగంగానే ఈ ప్రతిపాదనలు చేసింది. ఇవి కాకుండా ఉక్రెయిన్కు 68.2 కోట్ల డాలర్లను ప్రతిపాదించింది. అఫ్గానిస్థాన్లో 20 ఏళ్ల యుద్ధాన్ని చాలించి అమెరికన్ సేనలను ఉపసంహరించేటప్పుడే ఇక తాము చైనా, రష్యాల దూకుడును నిరోధించడానికి ఐరోపా, ఇండో పసిఫిక్ మిత్రులతో కలిసి పని చేస్తామని బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనలు చేసినట్లు భావిస్తున్నారు.
భారత్కు అమెరికా అభివృద్ధి సాయం పెంపు
హరిత ఇంధనాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పురోగతి సాధించడానికి భారతదేశానికి అదనపు నిధులు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదిస్తున్నారు. నిరంకుశత్వంపై పోరాటానికీ ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. 2021లో భారత్ కు 2.5 కోట్ల డాలర్ల అభివృద్ధి సహకారాన్ని అందించిన అమెరికా 2023లో దాన్ని 6.6 కోట్ల డాలర్లకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. అమెరికా కాంగ్రెస్కు ఈ ప్రతిపాదనను సమర్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ