Supreme Court: 41 ఏళ్లలో 60 కేసులు పెట్టుకొన్న భార్యాభర్తలు!.. విస్తుపోయిన సుప్రీంకోర్టు
భార్యాభర్తలు పరస్పరం 60 కేసులు పెట్టుకొన్న తీరును చూసి సుప్రీంకోర్టు విస్తుపోయింది.
మధ్యవర్తిత్వానికి వెళ్లండి : సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం
దిల్లీ: ముప్పై ఏళ్లు కాపురం చేసి.. 11 ఏళ్లుగా విడిగా ఉంటున్న భార్యాభర్తలు పరస్పరం 60 కేసులు పెట్టుకొన్న తీరును చూసి సుప్రీంకోర్టు విస్తుపోయింది. మీ న్యాయవాదుల చాతుర్యాన్ని తప్పక గుర్తించాలని వ్యాఖ్యానించిన కోర్టు వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి వెళ్లండంటూ విడిపోయిన దంపతులకు బుధవారం సూచించింది. ‘ఏం చేద్దాం! కొన్ని వివాదాలు అట్టే పరిష్కారం కావు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగడానికే వాళ్లు ఇష్టపడతారు. ఎపుడైనా ఒకరోజు కోర్టును చూడకపోతే, ఆ రోజు వారికి నిద్ర పట్టదు’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేలా మధ్యవర్తిత్వానికి వెళ్లడం ఉత్తమమని దంపతుల తరఫు న్యాయవాదులకు తెలిపింది. జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కొహ్లి కూడా ఉన్న ధర్మాసనం.. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కారమయ్యేదాకా ఇతర పెండింగు కేసుల జోలికి వెళ్లేందుకు ఇద్దరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్