ఇల్లు తగులబెట్టి రూ.2 లక్షలు బూడిద చేసిన ఎలుక

గుజరాత్‌లో ఓ ఎలుక చేసిన పనికి ఇల్లు కాలిపోయింది. రూ.2 లక్షల నగదు దగ్ధమైంది.

Updated : 07 Apr 2022 11:52 IST

గుజరాత్‌లో ఓ ఎలుక చేసిన పనికి ఇల్లు కాలిపోయింది. రూ.2 లక్షల నగదు దగ్ధమైంది. చైత్ర నవరాత్రుల సందర్భంగా వ్యాపారవేత్త వినోద్‌భాయ్‌ తన ఇంట్లో దీపం వెలిగించాడు. ఆ తర్వాత మండుతున్న దీపాన్ని ఎలుక ఈడ్చుకెళ్లి దుస్తుల్లో పడేసింది. దీంతో ఇళ్లంతా మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని