Crime News: సోషల్ మీడియాలో స్నేహం.. వీడియోలతో బెదిరించి అత్యాచారం!
రాజస్థాన్లో ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
రాజస్థాన్లో ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. 27 ఏళ్ల బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. 8 ఏళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. ఐదు నెలల క్రితం ఓ యువకుడితో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి రోజూ వీడియో కాల్స్ చేసుకొనేవారు ఈ క్రమంలోనే ఆమె ఆశ్లీల దృశ్యాలను రికార్డు చేశాడు. గతేడాది డిసెంబర్లో ఆమె ఫోన్ నుంచి మరికొన్ని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సేకరించాడు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పి బెదిరించాడు. తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని స్నేహితుడి ఇంట్లో బంధించగా, స్నేహితుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె కనిపించడం లేదన్న కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోని దిగి ఆచూకీ గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్