Crime News: సోషల్‌ మీడియాలో స్నేహం.. వీడియోలతో బెదిరించి అత్యాచారం!

రాజస్థాన్‌లో ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

Updated : 22 Apr 2022 09:45 IST


రాజస్థాన్‌లో ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అశ్లీల వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. 27 ఏళ్ల బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. 8 ఏళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. ఐదు నెలల క్రితం ఓ యువకుడితో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి రోజూ వీడియో కాల్స్‌ చేసుకొనేవారు ఈ క్రమంలోనే ఆమె ఆశ్లీల దృశ్యాలను  రికార్డు చేశాడు. గతేడాది డిసెంబర్‌లో ఆమె ఫోన్‌ నుంచి మరికొన్ని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సేకరించాడు. వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని చెప్పి బెదిరించాడు. తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని స్నేహితుడి ఇంట్లో బంధించగా, స్నేహితుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు.  ఆమె కనిపించడం లేదన్న కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోని దిగి ఆచూకీ గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని