విద్యుత్‌ టవర్ల చోరీకి విఫలయత్నం!

పంజాబ్‌లోని బఠిండా జిల్లాలో ఏకంగా హైఓల్టేజి విద్యుత్తు స్తంభాలనే చోరీ చేయడానికి దొంగలు విఫలయత్నం చేశారు. రాంపుర పూల్‌లో రెండు 66 కేవీ హైఓల్టేజి విద్యుత్తు స్తంభాలను ఎత్తుకెళ్లాలని యోచించిన దుండగులు టవర్ల బోల్టులు

Published : 22 May 2022 06:06 IST

పంజాబ్‌లోని బఠిండా జిల్లాలో ఏకంగా హైఓల్టేజి విద్యుత్తు స్తంభాలనే చోరీ చేయడానికి దొంగలు విఫలయత్నం చేశారు. రాంపుర పూల్‌లో రెండు 66 కేవీ హైఓల్టేజి విద్యుత్తు స్తంభాలను ఎత్తుకెళ్లాలని యోచించిన దుండగులు టవర్ల బోల్టులు తొలగించడంతో అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో అక్కడి నుంచి అందరూ పరుగులు తీశారు. దొంగలు చేసిన పనికి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇదంతా ఒకేరోజు చేశారా? కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారా అన్నది తెలియరాలేదు. ఈమేరకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని