ఇ-బైక్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతం

ఎలక్ట్రిక్‌ బైక్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువతి మృత్యువాతపడిన విషాద ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటుచేసుకుంది. మోప్రో గ్రామానికి చెందిన శివానీ అనిల్‌ పాటిల్‌ (23) కుటుంబం ఇటీవల

Published : 24 May 2022 05:22 IST

 మహారాష్ట్రలో యువతి దుర్మరణం

ముంబయి: ఎలక్ట్రిక్‌ బైక్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువతి మృత్యువాతపడిన విషాద ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటుచేసుకుంది. మోప్రో గ్రామానికి చెందిన శివానీ అనిల్‌ పాటిల్‌ (23) కుటుంబం ఇటీవల ఇ-బైక్‌ను కొనుగోలు చేసింది. ఆదివారం మధ్యాహ్నం శివానీ బైక్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో విద్యుదాఘాతాకి గురై కుప్పకూలింది. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని