వెన్నుపోటు పొడవాలని ఏ హిందుత్వం చెప్పింది?
వెన్నుపోటు పొడవాలని ఏ హిందుత్వ చెప్పిందని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని, శివసేన పార్టీని తాము రక్షించుకోగలమని విశ్వాసం వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘ఈటీవీ భారత్’తో ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు తమ పార్టీలో నాలుగుసార్లు అసమ్మతులు తలెత్తినా అన్నింటినీ అధిగమించామనీ,
ఎన్నో అసమ్మతుల్ని అధిగమించాం.. ఈసారీ అంతే..
శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది
దిల్లీ: వెన్నుపోటు పొడవాలని ఏ హిందుత్వ చెప్పిందని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని, శివసేన పార్టీని తాము రక్షించుకోగలమని విశ్వాసం వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘ఈటీవీ భారత్’తో ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు తమ పార్టీలో నాలుగుసార్లు అసమ్మతులు తలెత్తినా అన్నింటినీ అధిగమించామనీ, ఈసారీ అదే జరుగుతుందని ధీమాగా చెప్పారు. ‘ప్రభుత్వం ఉంటుందా లేదా, మెజార్టీ ఉందా లేదా అనేవి శాసనసభ వేదికగానే తేలాలే తప్పితే గువాహటిలోని ఐదు నక్షత్రాల హోటల్లో కాదు. అసమ్మతి నేతల కోసం అసెంబ్లీని అక్కడకు తీసుకువెళ్లలేం. వారే ముంబయికి వచ్చి, ఏం చేయాలనుకున్నా ఇక్కడే చేయాలి. మూడింట రెండొంతుల ఆధిక్యం ఉందని చెబుతున్నవారు దానిని అసెంబ్లీలో రుజువు చేసుకోవాలి. దానికోసం ఎన్నికల సంఘం వద్దకు మేం వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకసారి అనర్హత వేటు పడితే వారి పేర్లు ప్రజల స్మృతిపథం నుంచి చెరిగిపోతాయి’ అని ఆమె పేర్కొన్నారు.
అప్పుడే చర్చించాం
అసమ్మతి నేతలు రెండున్నరేళ్ల తర్వాత హిందుత్వం గురించి మాట్లాడుతున్నారని చతుర్వేది విమర్శించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పుడే ఆ విషయమై ఏక్నాథ్ శిందే, గులాబ్రావ్ పాటిల్ సహా అందరితో చర్చించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహా వికాస్ అఘాడీ సర్కారులో బాధ్యతల్ని తీసుకున్నవారు ఇప్పుడెందుకు పారిపోవాల్సి వచ్చిందో మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుత్వను అనుసరిస్తూనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే నిలుస్తున్నారనీ, హిందుత్వ పాలన గురించి, వసుధైక కుటుంబం కోసం మాట్లాడే మొదటి పార్టీ శివసేనే అని చతుర్వేది చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు