మంచు చరియలు విరిగిపడి అయిదుగురు పర్వాతారోహకుల మృతి

ఇటలీలో మంచు చరియలు విరిగిపడి అయిదుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు

Published : 04 Jul 2022 06:17 IST

రోమ్‌: ఇటలీలో మంచు చరియలు విరిగిపడి అయిదుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక ఇటాలియన్‌ టీవీ పేర్కొంది. పలువురు గల్లంతయ్యారని.. మృతుల సంఖ్యపై ఇంకా నిర్ధారణకు రాలేమని తెలిపింది. ఈ ఘటన 11వేల అడుగుల ఎత్తులో ఉన్న మార్మోలాడ పర్వత ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు