Omicron: వ్యాక్సినేషన్ రేటు తగ్గడమే కారణమా?
కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలోనే కొత్త వేరియంట్లు ఉద్భవిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తర్వాత టీకా పంపిణీ, వైరస్ మ్యూటేషన్లు, కొత్త వైరస్పై వ్యాక్సిన్ల
టీకాలు విస్తృతంగా ఇవ్వకపోవడం వల్లే ఒమిక్రాన్ పుట్టి ఉండొచ్చని నిపుణుల విశ్లేషణ
దిల్లీ: కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలోనే కొత్త వేరియంట్లు ఉద్భవిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తర్వాత టీకా పంపిణీ, వైరస్ మ్యూటేషన్లు, కొత్త వైరస్పై వ్యాక్సిన్ల సమర్థత అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ విస్తృతి తక్కువగా ఉండటం వల్లే కొత్త రకాలు పుట్టుకొస్తుండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
కొత్త వేరియంట్లు ఎలా పుడతాయంటే?
రోగి శరీరంలో వైరస్ తన ప్రతిరూపాలను తయారుచేసుకుంటుంది. సాధారణంగానే ఈ ప్రతిరూపాల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించేందుకు కొన్ని సార్స్ వైరస్లు మాత్రమే అవసరమవుతాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి చేరి పునరుత్పత్తి చేయడం ప్రారంభిస్తే రోగికి ప్రమాదకరంగా మారుతుంది. రోగి శరీరంలో లక్షల కొద్దీ వైరస్ కణాలు పుట్టుకొస్తాయి. ఇందులో కొన్ని కణాలు రోగి శరీరం నుంచి (శ్వాసకోశం ద్వారా) బయటకు వచ్చి ఇతరులకు వ్యాపిస్తాయి. వైరస్ కణాలు ఉద్భవించే క్రమంలో ఆర్ఎన్ఏ పునరుత్పత్తి సరిగా జరగదు. దీంతో వైరస్ నిర్మాణంలో తప్పులు దొర్లుతాయి. తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి.
కొన్ని వేరియంట్లు ఎందుకు ప్రమాదకరం?
వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు కొన్ని వేరియంట్లు కణాల్లోకి చొరబడే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. మరికొన్ని రకాలు మాత్రం పునరుత్పత్తిలో మెరుగ్గా ఉంటాయి. కొన్ని ‘ఫిట్టర్’ వేరియంట్లు ప్రధాన వైరస్గా మారుతుంటాయి. ఎవరికైనా సార్స్-కోవ్-2 సోకితే.. ఆ రోగి శరీరం మరింత చురుకైన వేరియంట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.
వేగంగా వ్యాపిస్తుందా?
ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రోటీన్లో 32 ఉత్పరివర్తనలు ఉన్నట్లు వెల్లడైంది. వ్యాప్తిని అధికం చేసే మ్యూటేషన్లతో పాటు రోగనిరోధకతను ఏమార్చే మార్పులూ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది.
వైరస్ మార్పులపై వ్యాక్సిన్ల ప్రభావం?
డెల్టా సహా సార్స్-కోవ్-2పై ప్రస్తుత వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయి. ఈ టీకాలు వైరస్లోని స్పైక్ ప్రొటీన్ను లక్ష్యంగా చేసుకుంటాయి. ఆ ప్రొటీన్ సాధారణంగా ఎక్కువ మార్పులకు లోను కాదు. కాబట్టి వైరస్పై టీకాలు ఇంకా పనిచేస్తున్నాయి. అయితే, బీటా, గామా, లాంబ్డా, మ్యూ వంటి కొన్ని వేరియంట్లు వ్యాక్సిన్ ఇమ్యూనిటీని కొంతమేర ఎదుర్కొంటున్నాయి. రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించకపోవడమే ఇందుకు కారణం. అయితే, రోగనిరోధకతను ఎదిరించే వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా పరిమితంగానే ఉన్నాయి.
తక్కువ వ్యాక్సినేషన్ రేటు కారణమా?
టీకా కవరేజీకి, సార్స్-కోవ్-2 వేరియంట్లు పుట్టుకురావడానికి మధ్య ఉన్న సంబంధంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే వ్యాక్సినేషన్ విస్తృతి తక్కువగా ఉంటే నిర్దిష్ట ప్రాంతంలో వైరస్ వ్యాప్తి పెరిగి కొత్త వేరియంట్లు ఉద్భవించే ప్రమాదం పెరుగుతుంది. దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ రేటు 24 శాతం మాత్రమే ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. వ్యాక్సిన్ సమర్థత సుదీర్ఘకాలం ఉండాలి.
దక్షిణాఫ్రికాలో తక్కువ వ్యాక్సిన్ కవరేజీ సైతం ఒమిక్రాన్ పుట్టుకకు కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకరమైన ఒమిక్రాన్ ఆవిర్భావానికి వైరస్లో ఇదివరకు సంభవించిన మార్పులు సైతం కారణమై ఉండొచ్చు. మ్యూటేషన్లు అధికంగా ఉన్న వేరియంట్లు ఇదివరకూ పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఇంత వేగంగా వ్యాప్తి చెందలేదు. వ్యాక్సిన్ కవరేజీని పెంచడం ద్వారా వైరస్లో మార్పులను పరిమితం చేయవచ్చు. టీకా విస్తృతి అనేది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొత్త వేరియంట్ల వ్యాప్తిని కట్టడి చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు