Crime News: కుమారుడిని కరిచిందని.. కుక్కను చంపేశాడు

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మూగజీవి పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన కుమారుడిని కరిచిందన్న కోపంతో

Updated : 02 Dec 2021 10:47 IST

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మూగజీవి పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన కుమారుడిని కరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి అతి దారుణంగా శునకం ప్రాణాలు తీశాడు. గ్వాలియర్‌ జిల్లా సిమారియాతల్‌ గ్రామంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నిందితుడు... శునకాన్ని చితకబాదుతున్నట్లుగా కనిపించింది. అది నొప్పితో విలవిలలాడుతున్న క్రమంలో దాని కాలిని పదునైన ఓ కత్తితో కోయడం కనిపించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌(పెటా) కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. పెటా కార్యకర్త ఛాయా తోమర్‌ ఫిర్యాదుతో నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్పీ అమిత్‌ సంఘీ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని