T20 World Cup: అఫ్గాన్ను తక్కువగా అంచనా వేయొద్దు: భజ్జీ
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా తర్వాతి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనున్న నేపథ్యంలో దాన్ని క్వార్టర్ ఫైనల్లా చూడొద్దని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ఆదివారం న్యూజిలాండ్తో తలపడనున్న నేపథ్యంలో దాన్ని క్వార్టర్ ఫైనల్లా చూడొద్దని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కోహ్లీసేన సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. మరోవైపు న్యూజిలాండ్ది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్ భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ వంటిదని అభిమానులు భావిస్తున్నారు. దాన్ని అలా భావించొద్దని.. ఈ గ్రూప్లో అఫ్గానిస్థాన్ కూడా ప్రమాదకరమైన జట్టేనని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఆ జట్టు స్కాట్లాండ్ను 130 పరుగుల భారీ తేడాతో ఓడించిన విషయాన్ని గుర్తుచేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు గ్రూప్-2లో పాకిస్థాన్ ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి టైటిల్ రేసులో ఫేవరెట్గా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం టీమ్ఇండియాపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు మంగళవారం న్యూజిలాండ్పైనా ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఈ గ్రూప్ పాయింట్ల పట్టికలో పైనుంది. ఈ క్రమంలోనే మిగిలిన మ్యాచ్ల్లో ఆ జట్టు.. అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాలను ఓడించి సెమీస్కు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే గ్రూప్ నుంచి రెండో జట్టుగా సెమీస్లో అర్హత సాధించేందుకు టీమ్ఇండియా, న్యూజిలాండ్ ప్రధానంగా పోటీపడుతున్నాయి. దీంతో ఈనెల 31న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఇందులో ఓడిన జట్టు సెమీస్కు చేరడం కష్టంగా మారే అవకాశం ఉంది. అలాగే ఏ జట్టు గెలిచినా తన తర్వాతి మ్యాచ్లో అఫ్గానిస్థాన్తో తలపడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టీమ్ఇండియాకు ఇది క్వార్టర్ ఫైనల్ కాదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
‘న్యూజిలాండ్తో పోరు క్వార్టర్ ఫైనల్ లాంటిది కాదు. ఇది కూడా ఒక సాధారణ మ్యాచ్. అయితే, అఫ్గానిస్థాన్ను తక్కువ అంచనా వేయొద్దు. అదీ ప్రమాదకరమైన జట్టే.. ఏ టీమ్నైనా ఓడించగలదు. ఇక టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే తొలుత చేయాల్సిన పని న్యూజిలాండ్ను ఓడించడం. మన ఆటగాళ్లపై నాకా నమ్మకం ఉంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్ల్లో విజయం సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ఇండియాకు ప్రతి మ్యాచ్ ముఖ్యమైందే. అందుకోసం కోహ్లీసేన సిద్ధంగా ఉందని బలంగా నమ్ముతున్నా. కచ్చితంగా గెలుస్తారనే అనుకుంటున్నా. భారత్ గొప్ప జట్టే అయినా పాకిస్థాన్తో తలపడిన రోజు మనదికాదు’ అని హర్భజన్ అన్నాడు. దాయాది జట్టుతో ఓటమి టీమ్ఇండియాకు మేలుకొలుపు లాంటిదని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.