Team India: 10 మంది 10 కొట్టలేదు!
టీ20 క్రికెట్.. చాలా విచిత్రమైన ఆట! అప్పటికప్పుడు హీరోలుగా చేస్తుంది. క్షణాల్లో జీరోలుగా మారుస్తుంది. ఎంత పటిష్ఠమైన జట్టైనా కొన్నిసార్లు....
ధోనీసేన కోరుకోని రికార్డిది
టీ20 క్రికెట్.. చాలా విచిత్రమైన ఆట! అప్పటికప్పుడు హీరోలుగా చేస్తుంది. క్షణాల్లో జీరోలుగా మారుస్తుంది. ఎంత పటిష్ఠమైన జట్టైనా కొన్నిసార్లు తేలిపోతుంది. భీకర బౌలింగ్ను ఊచకోత కోసే బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోతారు. టీమ్ఇండియాకూ ఇది తప్పలేదు. ఆసీస్పై 74కే ఆలౌటైన ఓ పోరులో 10 మంది బ్యాటర్లు 10 స్కోరును అందుకోలేకపోయారు తెలుసా!
ఇదే తొలిసారి
పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ఇండియా మూడుసార్లు వందలోపే ఆలౌటైంది. అందులో అత్యల్ప స్కోరు 74. మెల్బోర్న్ వేదికగా 2008, ఫిబ్రవరిలో ఆసీస్తో జరిగిన మ్యాచులో చేసింది. భారత టీ20 చరిత్రలో తొలిసారి 10 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు చేయలేక ఇబ్బంది పడ్డారు. టెస్టులాడే దేశాల్లో ఘోరమైన గణాంకాలు ఇవే. ఆతిథ్య జట్టు మరో 52 బంతులు మిగిలుండగానే వికెట్ నష్టపోయి విజయం సాధించింది. న్యూజిలాండ్, విండీస్కూ ఇలాంటి రికార్డులున్నా వారి స్కోర్లు 80, 101 కావడం గమనార్హం.
పెవిలియన్కు వరుస
9, 0, 8, 1, 8, 9, 26, 6, 1, 0, 3*.. ఇవీ టీమ్ఇండియా ఆటగాళ్ల స్కోర్లు. తొలుత బ్యాటింగ్కు దిగిన ధోనీసేనను నేథన్ బ్రాకెన్ (3), ఆడమ్ వోజెస్ (2) బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్ ఐదో బంతికే సెహ్వాగ్ (0) రనౌట్ అయ్యాడు. డైవ్ చేస్తూ క్లార్క్ వికెట్లకు బంతిని విసిరాడు. ఆ తర్వాతి ఓవర్లోనే గంభీర్ (9; 6 బంతుల్లో 1×4)ను బ్రాకెన్ పెవిలియన్ పంపించాడు. 12 పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 20 వద్ద ధోనీసేనకు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. 3 బంతుల వ్యవధిలో దినేశ్ కార్తీక్ (8; 8 బంతుల్లో 1×4), రాబిన్ ఉతప్ప (1; 3 బంతుల్లో) ఔటయ్యారు. బ్రెట్లీ 2.6వ వేసిన లో ఫుల్టాస్కు డీకే వికెట్లు ఎగిరాయి. అప్పట్లో మిడిలార్డర్లో వచ్చే రోహిత్ (8; 8 బంతుల్లో 1×4)ను జేమ్స్ హోప్స్ బౌల్డ్ చేశాడు. దాంతో 7 ఓవర్లకు భారత్ 32/5తో నిలిచింది.
నిలిచిన ఇర్ఫాన్.. ధోనీ
టీమ్ఇండియా కనీసం 50 పరుగులైనా చేయగలదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఎంఎస్ ధోనీ (9; 27 బంతుల్లో), ఇర్ఫాన్ పఠాన్ (26; 30 బంతుల్లో) నిలబడ్డారు. వీరిద్దరూ కలిసి ఒక్క బౌండరీ బాదలేదు. వికెట్ల మధ్య పరుగెడుతూనే ఆ మాత్రం స్కోరు చేశారు. అదీ గొప్పే. ఎందుకంటే భీకరమైన ఆ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ ఈ ద్వయం దాదాపు 10 ఓవర్లు నిలిచింది. లేదంటే జట్టు మొత్తంగా 10 ఓవర్లకే చాప చుట్టేసేదే. ఆరో వికెట్కు వీరిద్దరూ 30 బంతుల్లో 17 పరుగులు చేయడం గమనార్హం. ఐతే 12వ ఓవర్లో ధోనీని హస్సీ ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 49/6. మరో 11 పరుగులకే ప్రవీణ్ కుమార్ (6)ను నోఫ్కె పెవిలియన్ పంపించాడు. 63 పరుగుల వద్ద వరుస బంతుల్లో హర్భజన్ (1) , శ్రీశాంత్ (0)ను ఆడమ్ వోజెస్ ఔట్ చేశాడు. 17.3వ బంతికి పఠాన్ ఇచ్చిన క్యాచ్ను గిల్లీ అందుకోవడంతో టీమ్ఇండియా కథ ముగిసింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు