ఆ దెబ్బతో ధోనీ అంటే ఏంటో తెలిసొచ్చింది
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. తన రికార్డులు, పరుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, అతడి కెరీర్ మలుపు తిరిగింది మాత్రం ఈరోజే...
మహీ కెరీర్లో ఇదే కీలక మలుపు..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. తన రికార్డులు, పరుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, అతడి కెరీర్ మలుపు తిరిగింది మాత్రం ఈరోజే. సరిగ్గా 16 ఏళ్ల క్రితం.. 2005 ఏప్రిల్ 5న విశాఖపట్నం వేదికగా పాకిస్థాన్తో ఆడిన రెండో వన్డేలో మహీ(148; 123 బంతుల్లో 15x4, 4x6) ఎప్పటికీ గుర్తుండిపోయే శతకం సాధించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్తో అతడెంత గొప్ప ఆటగాడో చాటిచెప్పాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్కు చుక్కలు చూపించడమే కాకుండా క్రికెట్లో హెలికాఫ్టర్ సిక్సులను పరిచయం చేశాడు. దాంతో విశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇది అతడి కెరీర్లో కీలక ఇన్నింగ్స్ అయిన నేపథ్యంలో నాటి మ్యాచ్ విశేషాలు ఒకసారి గుర్తుచేసుకుందాం.
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గంగూలీ నేతృత్వంలోని టీమ్ఇండియా తొలుత 356/9 భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ సచిన్ తెందూల్కర్(2) విఫలమైనా వీరేంద్ర సెహ్వాగ్(74; 40 బంతుల్లో 12x4, 2x6), ధోనీ రెచ్చిపోయారు. రెండో వికెట్కు వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 122 పరుగుల వద్ద సెహ్వాగ్ ఔటయ్యాడు. కాసేపటికే గంగూలీ(9) పెవిలియన్ చేరాడు. అప్పటికి స్కోర్ 140/3గా నమోదైంది. ఆపై రాహుల్ ద్రవిడ్(52; 59 బంతుల్లో 3x4)తో జోడీ కట్టిన ధోనీ నాలుగో వికెట్కు 149 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. చివర్లో వరుసగా వికెట్లు పడినా టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది.
అయితే, ఈ ఇన్నింగ్స్లో ధోనీ బ్యాటింగే హైలైట్. ఈ మ్యాచ్ ముందు వరకూ అతడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా కొనసాగాడు. అయితే, తెందూల్కర్ అనూహ్యంగా తక్కువ స్కోరుకే ఔటవ్వడంతో ధోనీని మూడో స్థానానికి బదిలీ చేశారు. రెచ్చిపోయిన అతడు పాక్ బౌలర్లకు దడ పుట్టించాడు. నాలుగు హెలికాఫ్టర్ షాట్లతో అభిమానులను ఉత్సాహపరిచాడు. ఇక తర్వాత బ్యాటింగ్ చేసిన పాక్ 44.1 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్ రజాక్(88; 93 బంతుల్లో 13x4, 1x6), మహ్మద్ యూసుఫ్(71; 56 బంతుల్లో 2x4, 4x6) రాణించారు. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ అదే ఏడాది అక్టోబర్ 31న శ్రీలంకపై (183*; 145 బంతుల్లో 15x4, 10x6) కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు