Wimbledon 2022: స్టార్ ఆటగాడికి కరోనా పాజిటివ్.. టోర్నీ నుంచి ఔట్..
గతేడాది వింబుల్డన్ టోర్నీ రన్నరప్గా నిలిచి ఈ సారి టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న ఇటాలియన్ టెన్నిస్ స్టార్ మాటియో బెరెట్టిని ఒక్క మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడికి కరోనా పాజిటివ్గా తేలడంతో వింబుల్డన్ 2022 నుంచి వైదొలిగాడు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది వింబుల్డన్ టోర్నీ రన్నరప్గా నిలిచి ఈ సారి టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న ఇటాలియన్ టెన్నిస్ స్టార్ మాటియో బెరెట్టిని ఒక్క మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడికి కరోనా పాజిటివ్గా తేలడంతో వింబుల్డన్ 2022 నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని స్వయంగా మాటియో బెరెట్టిని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ‘నాకు కొవిడ్ లక్షణాలు ఉన్నాయి.గత కొన్ని రోజుల నుంచి ఐసోలేషన్లో ఉంటున్నా. లక్షణాలు తీవ్రంగా లేనప్పటికీ నా తోటి ఆటగాళ్లు, టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఉదయం మరొకసారి కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. దాంట్లో నాకు పాజిటివ్గా తేలింది. అందుకే నేను వింబుల్డన్ నుంచి వైదొలుగుతున్నా. టోర్నీ వైదొలగడం పట్ల తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నా. దానిని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. ఈ ఏడాది నా కల చెదిరింది. వచ్చే మరింత బలంగా ముందుకు వస్తా’ అని బెరెట్టిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.మాటియో బెరెట్టిని 2021 వింబుల్డన్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ చేతిలో బెరెట్టిని పరాజయం పాలయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’