IND vs SA : చెలరేగిన శార్దూల్‌..!

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా మారుతోంది. టీ బ్రేక్‌ సమయానికి దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో మహరాజ్ (11*)...

Published : 04 Jan 2022 18:23 IST

జోహెన్నెస్‌బర్గ్‌: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. టీ బ్రేక్‌ సమయానికి దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో మహరాజ్ (11*), జాన్సన్ (2*) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 202 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 11 పరుగులు వెనుకబడి ఉంది. డీన్‌ ఎల్గర్ 28, మార్‌క్రమ్ 7, కీరన్‌ పీటర్సెన్ 62, డస్సెన్ 1, బవుమా 51, కైల్‌ 21 పరుగులు చేశారు. భారత బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (5/43) అద్భుత ప్రదర్శన చేశాడు. షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని