IND vs ENG: ఇంగ్లాండ్పై పరుగుల వరద పారించిన భారత ఆటగాళ్లు వీరే..
భారత్, ఇంగ్లాండ్ రెండు మేటి జట్లే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలో చూసిన రెండు జట్లు
భారత్, ఇంగ్లాండ్ రెండు మేటి జట్లే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా పటిష్ఠంగా ఉంటాయి. ఈ ఇరు జట్లు తలపడితే అభిమానులకు పండగే. అదీ సుదీర్ఘ ఫార్మాట్ అయితే ఆ మజా మరింత పెరుగుతుంది. ప్రస్తుతం టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఆంగ్లేయ జట్టుపై టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లెవరో తెలుసుకుందాం..
‘మాస్టర్’ మామూలుగా ఆడలేదు..
‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పేరొందిన సచిన్ తెందూల్కర్.. క్రీజులో ఉన్నాడంటే ఎంత దిగ్గజ బౌలర్ అయినా భయపడతాడు. ఎందుకంటే మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు పంపడం సచిన్కు వెన్నతో పెట్టిన విద్య. ఇక, ఇంగ్లాండ్పై మాస్టర్ బ్లాస్టర్ టెస్టుల్లో పరుగుల వరద పారించాడు. ఈ జట్టుపై 53 ఇన్నింగ్స్లు ఆడిన సచిన్.. 51.73 సగటుతో 2535 పరుగులు సాధించి ఆంగ్లేయ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తం మ్మీద ఇంగ్లాండ్పై ఏడు శతకాలు, 13 అర్ధశతకాలు చేశాడు. 2002 సంవత్సరం లీడ్స్లో జరిగిన టెస్టులో ఆతిథ్య జట్టుపై అత్యధికంగా 193 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సన్నీ...దంచేశాడు
సునీల్ గావస్కర్.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. సన్నీ క్రీజులో ఉంటే పరుగులకు ఢోకా లేదని అప్పట్లో భావించేవారు. నిలకడైన ఆటతీరుతో టీమ్ఇండియాకు ఎన్నో విజయాలనందించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్పై 67 ఇన్నింగ్స్లు ఆడిన గావస్కర్.. 38.20 సగటుతో 2483 పరుగులు సాధించాడు. దీంతో సచిన్ తర్వాత ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సన్నీ ఇంగ్లాండ్పై నాలుగు శతకాలు, 16 అర్ధశతకాలు చేశాడు. మరో విశేషమేమిటంటే టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్ సునీల్ గావస్కరే.
ది వాల్.. వండర్స్
‘డిఫెన్స్ కింగ్’ రాహుల్ ద్రవిడ్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రీజులోకి వచ్చాడంటే పాతుకుపోయి వికెట్ల ముందు గోడల నిలబడే రాహుల్.. ఓపిగ్గా బంతులు ఎదుర్కొంటూ పరుగులు రాబట్టేవాడు. ఇక, ద్రవిడ్కు ఇంగ్లాండ్పై మంచి రికార్డే ఉంది. ఈ జట్టుపై 37 ఇన్నింగ్స్లు ఆడిన ‘ది వాల్’... 60.93 సగటుతో 1950 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్పై 217 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును చేశాడు. తన కెరీర్లో 164 టెస్టులు ఆడిన ద్రవిడ్... 52.31 సగటుతో 13,288 పరుగులు సాధించాడు.
గుండప్ప.. అదరగొట్టాడు
1970ల్లో గుండప్ప విశ్వనాథన్ భారత టెస్టు క్రికెట్లో మంచి బ్యాట్స్మన్. విశ్వనాథన్కు టెస్టుల్లో ఇంగ్లాండ్పై మెరుగైన రికార్డు ఉంది. ఈ జట్టుపై 54 ఇన్నింగ్స్లు ఆడిన గుండప్ప.. 37.60 సగటుతో 1880 పరుగులు సాధించాడు. ఇదే జట్టుపై 222 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు. అంతేకాదు అరంగేట్ర టెస్టులోనే (ఆస్ట్రేలియాపై) శతకం(137) బాది రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్పై నాలుగు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం మ్మీద భారత్ తరఫున 91 మ్యాచ్లు ఆడిన గుండప్ప.. 41.93 సగటుతో 6080 పరుగులు చేశాడు. ఇందులో 14 శతకాలు, 35 అర్ధశతకాలున్నాయి.
రఫ్పాడిస్తున్న.. రన్ మెషీన్
నేటి తరం మేటి ఆటగాడు, టీమ్ఇండియా ‘రన్ మెషీన్’, ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్పై పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో విరాట్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రాకపోయినా.. గతంలో జరిగిన సిరీస్ల్లో ఇంగ్లాండ్ బౌలర్లను విరాట్ ఉతికారేశాడు. 2016లో ముంబయి వేదికగా జరిగిన టెస్టులో 235 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్పై 44 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. 44.00 సగటుతో 1804 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు