ప్చ్...హీరోలు జీరోలయ్యారే!!
మన అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే ఎక్కడో తెలియని సందడి, సంతోషం మొదలవుతుంటుంది. అదే సినిమాకి ఉత్తమ దర్శకుడు పనిచేసి, భారీ బడ్జెట్లో రూపొందిస్తే.. దానిపై అంచనాలకు అవధులు ఉండవు. అదే తరహాలో.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే
భారీ ధరకు పలికి విఫలమైన ఆటగాళ్లు
మన అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే ఎక్కడో తెలియని సందడి, సంతోషం మొదలవుతుంటుంది. అదే సినిమాకి ఉత్తమ దర్శకుడు పనిచేసి, భారీ బడ్జెట్లో రూపొందిస్తే.. దానిపై అంచనాలకు అవధులు ఉండవు. అదే తరహాలో.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే మ్యాచ్ విన్నర్లను లీగ్లోని జట్లు భారీమొత్తంలో వెచ్చించి మరీ సొంతం చేసుకుంటుంటాయి. దీంతో రికార్డు విజయాలు, కళ్లుచెదిరే సిక్సర్లు, అబ్బురపరిచే యార్కర్లు ఉంటాయని అభిమానులు ఆశిస్తుంటారు. కానీ, ఈ సీజన్లో సీన్ రివర్స్ అయింది. భారీ ధర పలికిన ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ల స్టార్డమ్కు తగ్గట్లుగా మెరుపు ఇన్నింగ్స్లు, వికెట్లు ఎగిరిపడే బంతులు లేవు. ఈ సీజన్లో ఇలా నిరాశపర్చిన ఆటగాళ్ల గురించి చూద్దామా..!
ఒక్క సిక్సర్ కూడా బాదని మాక్స్వెల్
అలవోకగా సిక్సర్లు బాదడం, చురుకైన ఫీల్డింగ్, అవసరమైతే బంతితోనూ మాయ చేసే సత్తా.. ఇవన్నీ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాక్స్వెల్ సొంతం. అందుకే వేలంలో అతడ్ని పంజాబ్ రూ.10.75 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ, అతడు ఈ సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్ల్లో 15 సగటుతో 108 పరుగులే చేశాడు. అత్యుత్తమ స్కోరు 32. టోర్నీలో అతడు ఒక్క సిక్సర్ కూడా బాదకపోవడం గమనార్హం. ఇక స్పిన్నర్గానూ అతడు తేలిపోయాడు. మూడు వికెట్లే తీశాడు.
నిరాశపరిచిన కాట్రెల్
పాపం.. పంజాబ్! భారీ మొత్తంలో వెచ్చించి జట్టులోకి తీసుకున్న మరో ఆటగాడు కూడా ఈ సీజన్లో నిరాశపరిచాడు. వెస్టిండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్ను పంజాబ్ రూ.8.5 కోట్లకు దక్కించుకుంది. చక్కని లైన్ అండ్ లెంగ్త్తో బంతులు సంధించడం, పవర్ప్లేలోనే వికెట్లు సాధించడం అతడి ప్రత్యేకత. కానీ, ఈ సీజన్లో అతడు ఆకట్టుకోలేకపోయాడు. ఎక్కువ పరుగులు ఇస్తుండటంతో యాజమాన్యం అతడ్ని బెంచ్కే పరిమితం చేసింది. రాజస్థాన్ మ్యాచ్లో కాట్రెల్ వేసిన ఓవర్లో ఆల్రౌండర్ రాహుల్ తెవాతియా అయిదు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. ఆరు మ్యాచ్లు ఆడిన కాట్రెల్ ఆరు వికెట్లు సాధించాడు. లీగ్లో అతడికి ఇదే తొలి సీజన్.
మ్యాచ్ విన్నర్గా నిలవలేదు
ఆస్ట్రేలియా పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ను వేలంలో ముంబయి రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. వైవిధ్యంతో బంతులు వేసే కౌల్టర్నైల్ రాకతో ముంబయి జట్టులో మరో మ్యాచ్ విన్నర్ చేరాడని విశ్లేషకులు భావించారు. కానీ, అతడు అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయాడు. ఆడిన ఆరు మ్యాచ్ల్లో మూడు వికెట్లే సాధించి నిరాశపరిచాడు. ఫైనల్లో అయినా అతడు తన సత్తా చూపిస్తాడో లేదో చూడాలి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఈ సీజన్లోనూ అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
మెరవని హిట్టర్..
వెస్టిండీస్ బ్యాట్స్మన్ షిమ్రాన్ హెట్మైయర్ను దిల్లీ రూ.7.75 కోట్లకు తీసుకుంది. యువ దిల్లీలో మరో యువ హిట్టర్ చేరడంతో బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా మారుతుందని భావించారంతా. కానీ, హెట్మైయిర్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. 10 మ్యాచ్ల్లో 19 సగటుతో 138 పరుగులే చేశాడు. వరుసగా విఫలమవ్వడంతో తుదిజట్టులో అతడు చోటు కోల్పోయాడు. కానీ, తనదైన రోజున విధ్వంసం సృష్టించే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ క్వాలిఫయిర్-2లో తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విఫలమైన చావ్లా
టీ20ల్లో లెగ్ స్పిన్నర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను బోల్తాకొట్టిస్తూ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. అందుకే అనుభవజ్ఞుడైన పీయూష్ చావ్లాను చెన్నై రూ. 6.75 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. కానీ చావ్లా ఈ సీజన్లో నిరాశపరిచాడు. యూఏఈ పిచ్లపై ఇతర జట్ల స్పిన్నర్లు ప్రభావం చూపిస్తుంటే చావ్లా మాత్రం సత్తాచాటలేకపోయాడు. ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు వికెట్లే తీశాడు. పొదుపుగానూ బౌలింగ్ చేయలేకపోయాడు.
తేలిపోయిన జాదవ్ - బ్రావో
మిడిలార్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ను 2018లో చెన్నై రూ.7.8 కోట్లతో సొంతం చేసుకుంది. అప్పటినుంచి అతడిని జట్టులో కొనసాగిస్తోంది. దూకుడుగా ఆడుతూ జట్టుకు భారీ స్కోరు అందివ్వడంలో అతడు సిద్ధహస్తుడు. కానీ, ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేశాడు. కోల్కతాపై టెస్టు తరహాలో ఆడి భారీఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. 8 మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 62 పరుగులే చేశాడు. టోర్నీలో ఒక్క సిక్సర్ కూడా సాధించకపోవడం గమనార్హం. చెన్నై ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 6 మ్యాచ్లు ఆడిన అతడు ఆరు వికెట్లు, ఏడు పరుగులు చేశాడు. అతడికి చెన్నై రూ. 6.4 కోట్లు చెల్లించింది.
మునపటి రసెల్ కాదు
విధ్యంసకర బ్యాట్స్మన్ రసెల్ను 2018లో కోల్కతా రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. 2019 సీజన్లో ప్రత్యర్థులపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతడు ఈ సీజన్లో తేలిపోయాడు. అతడి స్థాయికి తగ్గ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. కొన్ని మ్యాచ్లకు అతడిని బెంచ్కే పరిమితం చేశారు. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన రసెల్ 117 పరుగులు, ఆరు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్ది కూడా ఇదే పరిస్థితి. 10 మ్యాచ్ల్లో నరైన్ 121 పరుగులు, 5 వికెట్లతో నిరాశపరిచాడు. దినేశ్ కార్తీక్ 14 మ్యాచ్ల్లో 169 పరుగులే చేశాడు. కోల్కతా నరైన్కు రూ.8.5 కోట్లు, దినేశ్ కార్తీక్కు రూ.7.4 కోట్లు చెల్లిస్తోంది. జట్టు కోసం, బ్యాటింగ్లో మెరుగవ్వడం కోసం ఈ సీజన్లో కార్తీక్ కెప్టెన్సీని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!