పంత్ గిల్క్రిస్ట్ లాంటోడు: చోప్రా
టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి ఫామ్ అందుకోవడంపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంతోషం వ్యక్తం చేశాడు. పంత్.. ఆస్ట్రేలియా మాజీ కీపర్, బ్యాట్స్మన్...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి ఫామ్ అందుకోవడంపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంతోషం వ్యక్తం చేశాడు. పంత్.. ఆస్ట్రేలియా మాజీ కీపర్, బ్యాట్స్మన్ ఆడం గిల్క్రిస్ట్ లాంటోడని ప్రశంసించాడు. సిడ్నీ వేదికగా టీమ్ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా ఎ జట్టుతో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 194 పరుగులకే ఆలౌటైంది. ఆపై కంగారూలు 108 పరుగులు చేశారు. ఇక శనివారం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడగా పృథ్వీషా(3) మినహా మిగతా బ్యాట్స్మెన్ ఫామ్ అందుకున్నారు.
హనుమ విహారి(104; 194 బంతుల్లో 13x4), రిషభ్పంత్(103; 73 బంతుల్లో 9x4, 6x6) శతకాలతో మెరవగా, మయాంక్ అగర్వాల్(61; 120బంతుల్లో 4x4, 2x6), శుభ్మన్గిల్ (65; 78 బంతుల్లో 10x4) అర్ధశతకాలతో రాణించారు. దీంతో భారత్ 386/4 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మ్యాచ్ అనంతరం భారత ప్రదర్శనపై విశ్లేషించిన ఆకాశ్చోప్రా.. బ్యాట్స్మెన్ అంతా రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు. తొలుత మయాంక్ అగర్వాల్పై స్పందిస్తూ.. అతడు ఆస్ట్రేలియాలోనే కెరీర్ ఆరంభించాడని, కీలక సమయంలో పరుగులు చేసినందుకు అభినందించాలన్నాడు. ఈ అర్ధశతకంతో అతడు తిరిగి ఫామ్ అందుకున్నాడని, అయితే.. ఇంకా పరుగుల దాహంతో ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ శతకం బాదకపోయినా ఫర్వాలేదని,టెస్టు మ్యాచ్ల్లో పెద్ద స్కోర్లు సాధించాలని చోప్రా ఆకాంక్షించాడు.
ఇక రిషభ్పంత్పై స్పందించిన మాజీ క్రికెటర్.. ఆట చివర్లో అతడు అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా మెరుపు శతకం బాదాడన్నాడు. పంత్ క్రీజులోకి వచ్చేసరికే హనుమ విహారి చాలా ముందున్నాడని, అలాంటిది మ్యాచ్ పూర్తయ్యే సమయానికి ఇద్దరూ శతకాలు సాధించారని చెప్పాడు. ఈ ఆటలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా తాను మొదట విహారిని అనుకున్నానని, అయితే.. పంత్ తన ఆటతో ఆ అభిప్రాయాన్ని మార్చాడన్నాడు. అతడు ఆడం గిల్క్రిస్ట్లాంటోడని కితాబిచ్చాడు. ఆసీస్ మాజీ గొప్ప ఆటగాడని, పంత్ బ్యాటింగ్ చూస్తే అతడే గుర్తొస్తాడన్నాడు. ఒక్క సెషన్లో పంత్ ఆట స్వరూపాన్ని మార్చేస్తాడని చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఇవీ చదవండి..
ఎన్నాళ్ల కెన్నాళ్లకు.. యువరాజ్ సిక్సర్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్