పంత్ను తీసుకుంటే సాహాకేం చెప్తారు?
బాక్సింగ్డే టెస్టులో టీమ్ఇండియా చేసే మార్పులపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తాజాగా తన ఫేస్బుక్లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
దిల్లీ: బాక్సింగ్డే టెస్టులో టీమ్ఇండియా చేసే మార్పులపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తాజాగా తన ఫేస్బుక్ ఖాతాలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ షమి రెండో టెస్టుకు దూరమవ్వడాన్ని పక్కనపెడితే సుమారు ఐదు మార్పులతో భారత్ బరిలోకి దిగనుందని చెప్పాడు. అందులో శుభ్మన్గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, నవ్దీప్ సైని లేదా మహ్మద్ సిరాజ్ ఉంటారన్నాడు.
పృథ్వీకి బదులు శుభ్మన్ లేదా రాహుల్ ఓపెనింగ్ చేస్తారని, మూడో టెస్టులో మళ్లీ
రోహిత్ అందుబాటులోకి వస్తే ఎవరో ఒకరు తప్పుకోవాల్సిందేనని చోప్రా సందేహం వెలిబుచ్చాడు. ఇక నాలుగో స్థానంలో రహానె బ్యాటింగ్ చేస్తుండగా, ఐదులో మళ్లీ రిషభ్పంత్ ఉంటాడని, తర్వాత రవీంద్ర జడేజా ఆడతాడని చెప్పాడు. ఈ క్రమంలోనే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హానుమ విహారి, వృద్ధిమాన్ సాహా చోటు కోల్పోతారన్నాడు. విహారి కచ్చితంగా తుది జట్టులో ఉండాలని మాజీ ఓపెనర్ సూచించాడు. అయితే, అతడి స్థానంలో జడేజాను ఆడిస్తారనే సమాచారం అందిందని తెలిపాడు.
ఇటీవలి కాలంలో విహారి బాగానే ఆడుతున్నాడని, అతడిని పక్కకు తప్పించడానికి కారణమేంటో ఎవరికీ తెలియదని చెప్పాడు. న్యూజిలాండ్ పర్యటనలో అర్ధశతకం, ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో శతకం సాధించాడని చోప్రా గుర్తుచేశాడు. ఇక కోహ్లీ లేనందును బ్యాటింగ్ ఆర్డర్లో మరింత బలం చేకూరేందుకు సాహాకు బదులు పంత్ను తీసుకొస్తారని తెలిపాడు. ఈ నేపథ్యంలో యువ బ్యాట్స్మన్ను తీసుకుంటే సాహాకు ఏం చెప్పి తొలగిస్తారని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.