టాస్‌ గెలిచి బౌలింగ్‌‌ ఎంచుకున్నఆరోన్‌ ఫించ్‌

మరికాసేపట్లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలుత బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-1తో వన్డే సిరీస్‌ గెలుపొందిన...

Updated : 04 Dec 2020 13:49 IST

కాన్‌బెరా: మరికాసేపట్లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలుత బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-1తో వన్డే సిరీస్‌ గెలుపొందిన ఆ జట్టు ఇప్పుడు పొట్టి సిరీస్‌పైనా కన్నేసింది. మరోవైపు మూడో వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో బోణీ కొట్టి తర్వాతి టీ20లపై పట్టుబిగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోటాపోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో తొలి టీ20పై ఆసక్తి పెరిగింది. 

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ‌(కెప్టెన్‌), మనీష్‌ పాండే, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, షమీ

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డిఆర్కీ షార్ట్‌, మాథ్యూవేడ్‌, స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, సీన్‌ అబోట్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వీప్సన్‌, ఆడం జంపా ,జోష్‌ హాజిల్‌వుడ్‌,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని