జింక్స్ ఒక సెంచరీ.. పలు రికార్డులు..
టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. శనివారం తన వ్యూహాలతో బౌలింగ్ త్రాయన్ని సమృద్ధిగా ఉపయోగించుకున్న అతడు ఆస్ట్రేలియాను తక్కువ...
దిగ్గజాల సరసన నిలిచిన తాత్కాలిక కెప్టెన్..
మెల్బోర్న్: టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. శనివారం తన వ్యూహాలతో బౌలింగ్త్రయాన్ని సమృద్ధిగా ఉపయోగించుకున్న అతడు ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకు పరిమితం చేసేలా చేశాడు. అలాగే ఆదివారం సైతం తనదైన బ్యాటింగ్తో క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ప్రతిష్ఠాత్మకమైన మెల్బోర్న్ మైదానంలో శతకం బాదడమే కాకుండా పలు ఆసక్తికర రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే పలువురు దిగ్గజ ఆటగాళ్ల సరసన చోటు సంపాదించుకున్నాడు.
వినో మన్కడ్ తర్వాత రహానె..
ఆదివారం రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి జడేజా(40*)తో కలిసి 104 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన రహానె(104*) టెస్టుల్లో 12వ శతకం బాదాడు. దీంతో మెల్బోర్న్లో రెండో శతకం బాదిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు వినోమన్కడ్ ఆ ఘనత సాధించారు. ఇక రహానె 2014లో టెస్టు సిరీస్ సందర్భంగా ఇదే మైదానంలో తొలిసారి మూడంకెల స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
సచిన్ సరసన చేరాడు..
ఇక ఇదే శతకంతో రహానె క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సరసన కూడా నిలిచాడు. 1999లో టీమ్ఇండియా కెప్టెన్గా వ్యవహరించిన మాస్టర్ బ్లాస్టర్ నాటి మెల్బోర్న్ టెస్టులో శతకంతో మెరిశాడు. ఆ తర్వాత భారత కెప్టెన్గా ఈ మైదానంలో సెంచరీ కొట్టింది ఈ ముంబయి బ్యాట్స్మనే. ఇదిలా ఉండగా, రహానె ఇదే రికార్డుపై ఆసియా కెప్టెన్ల జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. తెందూల్కర్, హనీఫ్ మహ్మద్, మహ్మద్ యూసుఫ్ తర్వాత మెల్బోర్న్లో సెంచరీ చేసిన కెప్టెన్గా నేడు కొత్త రికార్డు నమోదు చేశాడు.
భారత్ తరఫున ఐదో సారథి..
మరోవైపు ఇదే శతకంతో రహానె భారత కెప్టెన్గా ఇంకో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియాలో ఇంతకుముందు మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, విరాట్ కోహ్లీలాంటి దిగ్గజాలు కెప్టెన్లుగా శతకాలు బాదారు. వారి తర్వాత రహానె నేడు ఐదో కెప్టెన్గా ఆ ఘనత సాధించాడు. దీంతో ఒకే ఒక్క శతకంతో అజింక్య ఇన్ని రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సోమవారం మరో 96 పరుగులు సాధిస్తే మెల్బోర్న్లో అత్యధిక పరుగులు చేసిన టీమ్ఇండియా బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్(195) రికార్డును రహానె అధిగమించే వీలుంది. అదే జరిగితే ఇక్కడ రెండొందల మార్కును కూడా జింక్స్ అందుకునే అవకాశం ఉంది.
ఇవీ చదవండి..
రహానె శతకం.. భారత్ ఆధిపత్యం
ఆస్ట్రేలియాపై పంత్ కొత్త రికార్డు..
కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా