బ్యాట్తో చుక్కలు.. బంతితో నిప్పులు..
టీమ్ఇండియాలో కపిల్ దేవ్ ఎంతటి విశేషకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. 1983లో భారత్ ప్రపంచకప్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన దిగ్గజం అతడు. ఆ టోర్నీలో జింబాబ్వే కపిల్ సాధించిన...
కపిల్దేవ్ రికార్డునే బ్రేక్ చేసిన అగార్కర్
టీమ్ఇండియాలో కపిల్ దేవ్ ఎంతటి గొప్ప ఆటగాడో అందరికీ తెలిసిందే. 1983లో భారత్కు తొలి ప్రపంచకప్ను అందించిన దిగ్గజం అతడు. ఆ టోర్నీలో జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. మరి అలాంటి బ్యాట్స్మన్ వెస్టిండీస్పై అదే ఏడాది 22 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దాంతో భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా అర్ధశతకం నమోదు చేసిన తొలి క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. అయితే, భారత జట్టులో ఆ తర్వాత పలువురు పేరొందిన బ్యాట్స్మెన్ కొనసాగినా వాళ్లెవరికీ సాధ్యంకాని ఆ రికార్డును ఓ పేసర్ బద్దలుకొట్టాడు. అదెవరో కాదు.. టీమ్ఇండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన అజిత్ అగార్కర్. ఈ ముంబయి ఆల్రౌండర్ ఆ ఘనత సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విశేషాలు మీకోసం..
21 బంతుల్లో..
2000 డిసెంబర్ 14న జింబాబ్వే.. భారత పర్యటన సందర్భంగా రాజ్కోట్లో ఐదో వన్డే ఆడింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు భారత్ పెద్ద లక్ష్యాన్నే నిర్దేశించింది. సచిన్ తెందూల్కర్(27), రాహుల్ ద్రవిడ్(6), యువరాజ్(29), వీరేంద్ర సెహ్వాగ్(19) లాంటి మేటి బ్యాట్స్మెన్ విఫలమైనా.. హెమంగ్ బదాని(77; 99 బంతుల్లో 2x4, 1x6), రీతిందర్ సోధి(53; 67 బంతుల్లో 4x4, 1x6), అజిత్ అగార్కర్(67; 25 బంతుల్లో 7x4, 4x6) ఆదుకున్నారు. లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగిన అగార్కర్ వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. అప్పటిదాకా నత్తనడకన సాగిన స్కోర్బోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. ఎవరూ ఊహించని విధంగా అతడు రెచ్చిపోవడంతో ఎడాపెడా బౌండరీలు వచ్చాయి. దీంతో భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలోనే అగార్కర్ 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో 1983 నాటి కపిల్ దేవ్ రికార్డును 17 ఏళ్ల తర్వాత అతడు బద్దలుకొట్టాడు.
52 బంతుల్లో 3 వికెట్లు తీసి 26 పరుగులిచ్చాడు..
అనంతరం జింబాబ్వే బ్యాటింగ్కు దిగడంతో అగార్కర్ ఈసారి బంతితో రెచ్చిపోయాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆ జట్టు బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించాడు. అతడు వేసిన 8.4 ఓవర్లలో 3.10 ఎకానమీతో కేవలం 26 పరుగులే ఇచ్చాడు. దానికితోడు 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అగార్కర్కు తోడు మరోవైపు నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (2/37), రీతిందర్ సోధి (2/43), శ్రీధరన్ శ్రీరామ్ (2/50) తమ వంతు బౌలింగ్ చేశారు. దీంతో జింబాబ్వే 47.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. భారత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులో ట్రెవర్ మాడొండో(71; 70 బంతుల్లో 10x4) ఒక్కడే రాణించాడు. ఇక ఆ మ్యాచ్లో తొలుత బ్యాట్తో తర్వాత బంతితో మయా చేసిన అగార్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఇదిలా ఉండగా, ఈ ముంబయి పేసర్ భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గానూ మరో ఘనత తన పేరిట నమోదు చేసుకున్నాడు.
కెరీర్ ప్రయాణం సాగిందిలా..
ఇక 1998లో టీమ్ఇండియాకు ఎంపికైన అతడు కెరీర్ మొత్తంలో 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 109*, వన్డేల్లో 95 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేశాడు. అలాగే సుదీర్ఘ ఫార్మాట్లో మొత్తం 58 వికెట్లు తీయగా, వన్డేల్లో 288, టీ20ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమ్ఇండియా విజయం సాధించిన 2007 టీ20 ప్రపంచకప్ జట్టులోనూ అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. అతడు 2013లో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. కాగా, వన్డేల్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. అతడికన్నా మాజీ బౌలర్లు అనిల్కుంబ్లే 334, జవగళ్ శ్రీనాథ్ 315 ముందున్నారు.
-ఇంటర్నెట్డెస్క్
ఇవీ చదవండి..
కోహ్లీసేన ‘క్రికెట్ బుర్ర’ మిస్!
ఎంతెంత లాభం?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం