కాసిన్ని కవ్వింపులుంటే బాగుండు
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో కాసిన్ని కవ్వింపులుంటే బాగుండని మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు...
ఇంటర్నెట్డెస్క్: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో కాసిన్ని కవ్వింపులుంటే బాగుండని మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, సంజయ్ మంజ్రేకర్ సరదాగా అన్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లలో మార్పు వచ్చిందని, మైదానంలో సరదాగా కనిపిస్తున్నారని అగార్కర్ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో భారత్ ఛేదనకు దిగిన వేళ ఓపెనర్ శిఖర్ధావన్(52) ధాటిగా ఆడాడు. ఒకానొక సందర్భంలో అతడు క్రీజులో కాలుపైకి లేపడంతో కీపర్ మాథ్యూవేడ్ స్టంపౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. అది రీప్లేలో నాటౌట్గా తేలింది.
ఆ సంఘటన అనంతరం వేడ్.. ధావన్తో మాట్లాడుతూ ‘నేను ధోనీ కాదు. అతడంత వేగంగా స్టంపౌట్ చేయలేను’ అని పేర్కొన్నాడు. దానికి ధావన్ నవ్వేసి ఊరుకున్నాడు. ఇద్దరి మధ్యా హాస్యాస్పద ఘటన చోటుచేసుకోవడం స్టంప్ మైక్లో వినిపించింది. దీంతో అగార్కర్, మంజ్రేకర్ సైతం నవ్వుకొని ఇలా స్పందించారు. ‘వేడ్ చెప్పింది నిజమే. అతడు ధోనీ అంతటి వేగవంతం కాదు. అయితే, అవన్నీ సవాళ్లతో కూడుకున్నవి. అలాగే మైదానంలో చాలా మంచి వాతావరణం నెలకొంది. ఆటగాళ్లు సరదాగా నవ్వుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులకు మరీ బోర్ కొట్టకుండా కాసిన్ని కవ్వింపులుంటే ఇంకా బాగుంటుంది’ అని అగార్కర్ పేర్కొన్నాడు. అనంతరం మంజ్రేకర్ అందుకొని.. ‘ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్లో బాగా మార్పు వచ్చింది. ముఖ్యంగా బాల్టాంపరింగ్ వివాదం తర్వాత ఆ మచ్చని తొలగించుకోవాలని చూస్తున్నారు’ అని అన్నాడు. ఇక ఐపీఎల్లో భారత ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కూడా ఇంకో కారణమని తెలిపాడు. మరోవైపు కంగారూలు ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్ను పెద్దగా పట్టించుకోవడం లేదని, టెస్టు సిరీస్ ప్రారంభమైతే అసలు విషయం తెలుస్తుందని మాజీ బ్యాట్స్మన్ వివరించాడు. తాను అజిత్లాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్కు పాల్పడకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.
ఇవీ చదవండి:
లెక్క సరి
టీమిండియాలోకి మరో ధోనీ వచ్చాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?