ఆకాశ్×నీషమ్: లీగులో మరో వివాదం
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా న్యూజిలాండ్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు! అతడు చేసిన విమర్శకు ముక్కుసూటిగా సమాధానం ఇచ్చి మరోమారు మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఏంటనేగా మీ సందేహం...
ట్విటర్ వేదికగా పరస్పరం ఆరోపణలు
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా న్యూజిలాండ్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు! అతడు చేసిన విమర్శకు ముక్కుసూటిగా సమాధానం ఇచ్చి మరోమారు మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఏంటనేగా మీ సందేహం.
యూఏఈ వేదికగా జరుగుతున్న లీగులో పంజాబ్ నాలుగు మ్యాచులాడి మూడింట్లో ఓడిపోయింది. నిజానికి ఇందులో మూడింట్లో అది గెలవాల్సింది. జట్టు కూర్పు సరిగ్గా లేకపోవడం, డెత్ బౌలింగ్లో పస లేకపోవడంతో ఓటమి పాలవుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు కూర్పు ఏమాత్రం బాగాలేదని ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ముజీబుర్ రెహ్మాన్కు చోటివ్వలేకపోతున్నారని పేర్కొన్నాడు. కివీస్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ పవర్ప్లే, డెత్ బౌలింగ్లో రాణించలేదని, 4, 5 స్థానాల్లో భారీ షాట్లు ఆడి మ్యాచుల్ని గెలిపించలేడని పేర్కొన్నాడు. అతడు మ్యాచ్ విజేత కాకపోయినా ఆడించడంలో అర్థమేంటని ప్రశ్నించాడు.
ఈ విషయంపై నీషమ్ ట్విటర్లో స్పందించాడు. ఆకాశ్కు పంచ్ ఇవ్వాలని ప్రయత్నించాడు. అతడి గణాంకాలను ఎత్తిచూపుతూ.. ‘18.5 సగటు, 90 స్ట్రైక్రేట్తోనూ ఎక్కువ మ్యాచులు గెలిపించలేరుగా’ అంటూ ట్వీట్చేశాడు. నవ్వుతున్న ఏమోజీలను జత చేశాడు. ఇందుకు.. ‘నువ్వన్నది నిజమే మిత్రమా. అందుకే నన్నెవరూ ఎంచుకోవడం లేదు. మరో పని చేస్తున్నందుకు నాకు డబ్బులిస్తున్నారు. నా గణాంకాలపై తప్ప నా పరిశీలనలపై అభ్యంతరాలు లేనందుకు సంతోషం. లీగ్ మిగతా భాగంలో బాగా ఆడు’ అని ఆకాశ్ బదులిచ్చాడు.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్