భారత్తో టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక
భారత్తో త్వరలో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ఉదయం తమ జట్టును ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులను ఎంపిక చేయగా అందులో...
ఐదుగురు కొత్త క్రికెటర్లకు అవకాశం..
ఇంటర్నెట్డెస్క్: భారత్తో త్వరలో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ఉదయం తమ జట్టును ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులను ఎంపిక చేయగా అందులో ఐదుగురు కొత్త క్రికెటర్లకు అవకాశం కల్పించింది. కరోనా నేపథ్యంలో బయోబబుల్ పరిస్థితుల కారణంగా అదనంగా ఈ యువ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా, ఈ కొత్త క్రికెటర్లలో విల్ పుకోవిస్కి(Will Pucovski) అనే విక్టోరియా టీమ్ (ఆస్ట్రేలియా దేశవాళి జట్టు) ఓపెనర్ను ఎంపిక చేయడమే అసలు విశేషం. అతడు షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ద్విశతకాలు బాది 495 పరుగులు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటి అతడిని డేవిడ్ వార్నర్కు జోడీగా పనికొస్తాడని రెండో ఓపెనర్గా ఎంపిక చేసింది. మరోవైపు వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులోని కామరూన్ గ్రీన్ను కూడా ఎంపిక చేశారు. అతడు కూడా తన బ్యాటింగ్తో ఆకట్టుకుంటాడు. టిమ్పైన్ సారథ్యంలో ఆస్ట్రేలియా డిసెంబర్ 17 నుంచి కోహ్లీసేనతో టెస్టు సిరీస్ ఆడనుంది. అంతకుముందు ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు: టిమ్పైన్(కెప్టెన్), జేమ్స్ పాటిన్సన్, విల్ పుకోవిస్కి, స్టీవ్స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, మాథ్యూవేడ్, డేవిడ్వార్నర్, సీన్ అబ్బాట్, జోబర్న్స్, పాట్ కమిన్స్, కామరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మైఖేల్ నాసర్.
భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, శుభ్మన్గిల్, వృద్ధిమాన్ సాహా, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, నవ్దీప్ సైని, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం