కోహ్లీ పోరాడినా భారత్కు తప్పని ఓటమి
విరాట్ కోహ్లీ (85; 60 బంతుల్లో, 4×4, 3×6) పోరాడినా భారత్కు ఓటమి తప్పలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
12 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
ఇంటర్నెట్డెస్క్: విరాట్ కోహ్లీ (85; 60 బంతుల్లో, 4×4, 3×6) పోరాడినా భారత్కు ఓటమి తప్పలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అయిదు వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (80; 53 బంతుల్లో, 7×4, 2×6), మాక్స్వెల్ (54; 36 బంతుల్లో, 3×4, 3×6) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. స్వెప్సన్ (3/23) టీమిండియాను ఘోరంగా దెబ్బతీశాడు. ఈ విజయంతో ఆసీస్ 1-2తో మూడు టీ20ల సిరీస్లో క్లీన్స్వీప్ తప్పించుకుంది.
భారత్ లక్ష్య ఛేదన సాఫీగా సాగలేదు. మాక్స్వెల్ వేసిన తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ డకౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ.. శిఖర్ ధావన్ (28; 21 బంతుల్లో, 3×4)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. క్యాచ్లు చేజార్చి ఆసీస్ ఇచ్చిన అవకాశాల్ని విరాట్ సద్వినియోగం చేసుకున్నాడు. ధావన్తో కలిసి బౌండరీలు బాదుతూ రన్రేటును నియంత్రణలో ఉంచాడు. అయితే గబ్బర్ను స్వెప్సన్ ఔట్ చేసి స్కోరువేగానికి బ్రేక్లు వేశాడు. తన తర్వాత ఓవర్లోనే సంజు శాంసన్ (10), శ్రేయస్ అయ్యర్(0)ను ఔట్ చేసి స్వెప్సన్ టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు.
ఆసీస్ను భయపెట్టినా..
తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్య (20; 13 బంతుల్లో)తో కలిసి కోహ్లీ మరో వికెట్ పడకుండా కాస్త జాగ్రత్తగా ఆడటంతో విజయ సమీకరణం ఆఖరి 5 ఓవర్లలో 76 పరుగులుగా మారింది. అనంతరం హార్దిక్తో కలిసి కోహ్లీ టాప్ గేర్లోకి వెళ్లాడు. వీరిద్దరు సొగసైన బౌండరీలు, సిక్సర్లతో లక్ష్యాన్ని కరిగించారు. ఆండ్రూ డేనియల్ బౌలింగ్లో కళ్లుచెదిరే సిక్సర్లతో అలరించారు. దీంతో విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి. అయితే ధాటిగా ఆడుతున్న హార్దిక్ను జంపా ఔట్ చేసి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. మరోవైపు కోహ్లీ క్రీజులోనే ఉండటంతో భారత్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే 19వ ఓవర్లో విరాట్ ఔటవ్వడంతో టీమిండియా ఓటమి లాంఛనమైంది. ఆఖర్లో సుందర్ (7)తో కలిసి శార్దూల్ ఠాకూర్ (17*; 7 బంతుల్లో, 2×6) కంగారూలను కంగారు పెట్టించినా అద్భుతాలేమి జరగలేదు. ఆసీస్ బౌలర్లలో స్వెప్సన్ మూడు, జంపా, మాక్సీ, అబాట్ తలో ఒక వికెట్ తీశారు.
మాక్సీ-వేడ్ ధనాధన్
భారత్ పేలవమైన ఫీల్డింగ్ ఆస్ట్రేలియాకు లాభమైంది. అందివచ్చిన క్యాచ్లను నేలపాలు చేసి కంగారూలకు టీమిండియా అవకాశాలు ఇచ్చింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్ ఫించ్ను ఖాతా తెరవకముందే సుందర్ పెవిలియన్కు చేర్చాడు. వన్డౌన్లో వచ్చిన స్మిత్ (24; 23 బంతుల్లో, 1×4)తో కలిసి వేడ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే బౌండరీలు సాధించారు. దీంతో ఆ జట్టు పవర్ప్లేలో 51 పరుగులు చేసింది. అయితే స్మిత్ను బోల్తాకొట్టించి 65 పరుగుల వారిద్దరి భాగస్వామ్యానికి సుందర్ తెరదించాడు.
ఆ తర్వాత కోహ్లీసేనకు ఆసీస్ అవకాశమే ఇవ్వలేదు. మాక్స్వెల్తో కలిసి వేడ్ దూకుడుగా ఆడాడు. మాక్సీ స్విచ్షాట్లు, లాఫ్టెడ్ షాట్ల ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే 13వ ఓవర్లో చాహల్ బౌలింగ్లో మాక్సీ వికెట్ కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. కానీ అది నోబాల్ కావడంలో భారత్కు నిరాశ తప్పలేదు. అనంతరం మాక్స్వెల్.. వేడ్తో కలిసి సిక్సర్ల మోత మోగించాడు. ఆయితే భారత్ ఆఖరి రెండు ఓవర్లలో వికెట్లు తీయడంతో ఆసీస్ స్కోరు 200 దాటలేదు. భారత బౌలర్లలో సుందర్ రెండు, శార్దూల్, నటరాజన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!