కాంస్యమే.. కొండంత బలాన్నిచ్చింది
జర్మనీలో ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీ.. పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్స్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. గతేడాది ఆ టోర్నీలో స్వర్ణం నెగ్గిన ఆ బాక్సర్ మరోసారి ఫేవరేట్గా బరిలో దిగాడు...
ఒలింపిక్స్ దిశగా ఆత్మవిశ్వాసం పెరిగింది
‘ఈనాడు’తో బాక్సర్ హుసాముద్దీన్
జర్మనీలో ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీ.. పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్స్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. గతేడాది ఆ టోర్నీలో స్వర్ణం నెగ్గిన ఆ బాక్సర్ మరోసారి ఫేవరేట్గా బరిలో దిగాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కానీ ప్రత్యర్థి విసిరిన ఓ పంచ్ తన ఎడమ కనురెప్ప మీద బలంగా తాకడంతో చర్మం చిట్లి రక్తం కారడం మొదలైంది. కొద్దిసేపటికే కన్ను వాచి.. చూపు కొద్దిగా కష్టమైంది. అయినప్పటికీ అతను పోరాటం ఆపలేదు. ప్రత్యర్థిని 5-0తో చిత్తు చేశాడు. ఆ బౌట్ తర్వాత తన గాయానికి కుట్లు వేశారు. కానీ సెమీస్లో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేక కాంస్యానికే పరిమితమయ్యాడు. అతను గెలిచింది కంచు పతకమే కావొచ్చు కానీ టోర్నీలో తన తెగువతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ బాక్సర్ ఎవరో కాదు.. మన తెలంగాణ కుర్రాడు మహమ్మద్ హుసాముద్దీన్. ఒలింపిక్స్ దిశగా సాగుతున్న తనకు ఇటీవల గెలిచిన ఈ కాంస్యం కొండంత బలాన్నిచ్చిందని ‘ఈనాడు’తో చెప్పాడు. అతను ఇంకా ఏమన్నాడంటే..
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీలో కాంస్యానికే పరిమితమైనప్పటికీ ఆ పతకం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనడమే లక్ష్యంగా సాగుతున్న నాకు ఓ ప్రేరణనిచ్చింది. ఎందుకంటే నేను చివరగా టోర్నీలో పాల్గొంది ఫిబ్రవరిలో. ఆ తర్వాత లాక్డౌన్ వల్ల ఆటలన్నీ ఆగిపోయాయి. బాక్సర్లందరిలాగే నేనూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం పరిస్థితులు మెరుగు పడుతుండడంతో సాయ్ నిర్వహించిన శిక్షణ శిబిరానికి హాజరయ్యా. ఆ తర్వాత ఐరోపాలో శిక్షణ కోసం భారత బృందంతో కలిసి వెళ్లా. అక్కడ అంతర్జాతీయ బాక్సర్లతో కలిసి సాధన చేయడం ఎంతో ఉపయోగపడింది. తిరిగి ఫిట్నెస్ సాధించా. ఆటతీరును మార్చుకున్నా. రింగ్లో ఒకచోట కుదరుగా నిలబడి పంచ్లు విసరగలుగుతున్నా. టెక్నిక్ మెరుగైంది. అయినప్పటికీ దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత తొలిసారిగా బరిలో దిగడంతో ఆ ప్రపంచకప్ టోర్నీకి ముందు కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నా. ఇన్ని రోజులు సాధన చేసినప్పటికీ.. పోటీలకు దూరంగా ఉన్నా కాబట్టి రింగ్లో అడుగుపెట్టాక ఎలా స్పందిస్తానో అని సందేహించా. కానీ తొలి బౌట్లో విజయంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. మునుపటి జోరును ప్రదర్శించా.
ఆపాలనుకోలేదు..
క్వార్టర్స్లో జర్మనీ బాక్సర్ ఉమర్ బజ్వాతో పోరులో కనుబొమ్మకు గాయమైనప్పటికీ బౌట్ నుంచి మధ్యలో తప్పుకోవాలని అనుకోలేదు. ఏది ఏమైనా విజయం సాధించాలని అప్పుడు నా మనసులో ఉంది. అందుకే రక్తం కారినప్పటికీ ఆట ఆపలేదు. గతంలో ఒకసారి అదే చోట గాయమైంది. తర్వాత దాన్నుంచి కోలుకున్నా. మళ్లీ ఇప్పుడు కూడా అక్కడే దెబ్బ తగిలింది. అయినా ప్రత్యర్థికి తలవంచాలని భావించలేదు. అందుకే గాయమైనా రెట్టించిన ఉత్సాహంతో పంచ్లు విసిరా. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా దక్కకుండా మ్యాచ్ ముగించా. అయితే బౌట్ తర్వాత గాయానికి కుట్లు వేశారు. దీంతో సెమీస్లో పాల్గొనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. కానీ వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ దిశగా సాగుతున్న నాకు మంచి ప్రాక్టీస్ కావాలంటే బౌట్లో పాల్గొనాల్సిందేనని నిర్ణయించుకున్నా. కానీ గాయం బాధిస్తుండడంతో రింగ్లో వంద శాతం ప్రదర్శన ఇవ్వలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది. ఈ టోర్నీ ప్రతి ఏడాది జరగుతుంది. తక్కువ దేశాలే పాల్గొన్నప్పటికీ పోటీ తీవ్రత మాత్రం బాగానే ఉంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో పాల్గొనడంతో నాకు మేలు జరిగిందనే అనుకుంటున్నా.
ఆ దిశగా..
టోక్యో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నదే నా కల. గత ఒలింపిక్స్ (2016 రియో) సమయంలో వెన్నునొప్పితో అర్హత టోర్నీలకు దూరమయ్యా. కానీ ఈ సారి మాత్రం అవకాశం వదిలేది లేదు. ప్రస్తుతం నిజామాబాద్లోనే ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నా. ఇంకా గాయానికి వేసిన కుట్లు విప్పలేదు. దాని నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులో జాతీయ శిబిరంలో పాల్గొంటా. ఆ తర్వాత బల్గేరియాతో పాటు కొన్ని టోర్నీలు ఆడాల్సి ఉంది. ఒలింపిక్స్ అర్హత టోర్నీ జూన్లో ఉంది. ఆ లోపు వీలైనన్ని ఎక్కువ టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించి మరింత మెరుగ్గా సన్నద్ధమవాలి. జర్మనీ ప్రపంచకప్ టోర్నీలో భారత బాక్సర్లు గొప్పగా రాణించారు. మూడు స్వర్ణాలు సహా మొత్తం తొమ్మిది పతకాలు సాధించాం. ఈ టోర్నీ చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఒలింపిక్స్లోనూ ఇదే జోరు కొనసాగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM