చెన్నై అభిమానులకు చేదువార్త!
దిల్లీతో జరిగిన మ్యాచ్లో గాయంతో ఆఖరి ఓవర్ వేయలేకపోయిన చెన్నై ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో.. కోలుకోవడానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుందని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు...
ఇంటర్నెట్డెస్క్: దిల్లీతో జరిగిన మ్యాచ్లో గాయంతో ఆఖరి ఓవర్ వేయలేకపోయిన చెన్నై ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో.. కోలుకోవడానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుందని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్లో బ్రావో అస్వస్థతతో మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి ఓవర్లో స్పిన్నర్ జడేజాతో బౌలింగ్ చేయించగా చెన్నై పరాజయాన్ని చవిచూసింది. అయితే బ్రావోకి గజ్జల్లో గాయమైందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ అన్నాడు.
‘‘డెత్ బౌలర్ అయిన బ్రావోకి దురదృష్టవశాత్తు గాయం కావడంతో ఆఖరి ఓవర్ వేయలేకపోయాడు. ఇలాంటి సవాళ్లతో మా సీజన్ కొనసాగుతోంది. అయితే చివరి ఓవర్లో జడేజాతో బౌలింగ్ చేయించాలని మా ప్రణాళికలో లేదు. మాకు మరో అవకాశం లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం. మేం బాగానే ప్రయత్నించాం. మరింత కష్టపడాల్సి ఉంది. కాగా, బ్రావోకి కుడి కాలి గజ్జలో గాయమైంది. దాని తీవ్రత చూస్తే ఇప్పట్లో మైదానంలో అడుగు పెట్టేలాలేడు. అయితే ఆఖర్లో బౌలింగ్ చేయలేకపోయినందుకు అతడు ఎంతో బాధపడ్డాడు. జట్టు కోసం ఎంతో పరితపిస్తున్నాడు. గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు లేదా వారాల సమయం పడుతుంది’’ అని స్టీఫెన్ పేర్కొన్నాడు. మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న చెన్నై ప్లేఆఫ్కు చేరాలంటే మిగిలిన మ్యాచ్లు ఎంతో కీలకం. జట్టులో సీనియర్ ఆటగాడైన బ్రావో కీలక మ్యాచ్లకు దూరమవ్వడం ఆ జట్టుకు ప్రతికూలాంశమే.
చెన్నై నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. అజేయ శతకంతో చెలరేగి దిల్లీని గెలిపించిన ధావన్ను ఫ్లెమింగ్ కొనియాడాడు. ‘‘క్యాచ్లు జారవిడిచి ధావన్కు అవకాశాలు ఇచ్చాం. ఆదిలోనే ఔట్ చేసే అవకాశమొచ్చినా మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం. అయితే ధావన్ గొప్పగా ఆడాడు. దూకుడుగా ఆడుతూ కావాల్సిన రన్రేట్ను నియంత్రణలో ఉంచాడు. అతడిని ఔట్ చేసి ఉంటే మిడిలార్డర్పై ఒత్తిడి తెచ్చేవాళ్లం. కానీ మూడు, నాలుగు క్యాచ్లు అందుకోలేకపోవడం వల్ల మ్యాచ్ పరిస్థితి మారిపోయింది’’ అని అన్నాడు. ఏడు విజయాలతో దిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే