ఆ రెండూ సీఎస్కే బలం
సీనియర్ క్రికెటర్లైన సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లేకపోవడం కచ్చితంగా లోటేనని చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు షేన్వాట్సన్ అన్నాడు. అయితే జట్టుకు భీకరమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉందని పేర్కొన్నాడు. అనుభవం, నాణ్యత అనే రెండు ఆయుధాలు సీఎస్కే సొంతమని ధీమా వ్యక్తం చేశాడు....
రైనా, భజ్జీ లేకపోవడం లోటే: వాట్సన్
(BCCI Image)
ఇంటర్నెట్ డెస్క్: సీనియర్ క్రికెటర్లైన సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లేకపోవడం కచ్చితంగా లోటేనని చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు షేన్వాట్సన్ అన్నాడు. అయితే జట్టుకు భీకరమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉందని పేర్కొన్నాడు. అనుభవం, నాణ్యత అనే రెండు ఆయుధాలు సీఎస్కే సొంతమని ధీమా వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ షోలో అతడు మాట్లాడాడు.
గతేడాది రన్నరప్గా నిలిచిన చెన్నై ఈ సారి ఎన్నో ఆశలతో దుబాయ్లో అడుగుపెట్టింది. ఆ శిబిరంలో దీపక్ చాహర్, రుత్రాజ్ గైక్వాడ్ సహా 13 మందికి కొవిడ్-19 సోకడంతో కలవరం మొదలైంది. అదే సమయంలో సీనియర్ ఆటగాడు రైనా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేశాడు. భారత్లోనే ఉన్న హర్భజన్ సైతం జట్టుకు అందుబాటులో ఉండనని ప్రకటించేశాడు. కరోనా కారణంగా ఆ జట్టు ఆలస్యంగా సాధన మొదలుపెట్టింది. సెప్టెంబర్ 19న ముంబయి తొలి పోరుకు సిద్ధమవ్వడం కష్టంగానే అనిపిస్తోంది.
‘అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారంటే ఒత్తిడిలోనూ నైపుణ్యాలను ప్రదర్శించగలరని అర్థం. అందుకే ఈ ఏడాది ఐపీఎల్ మాకు గొప్పగా సాగుతుందనే అనిపిస్తోంది. ఎందుకంటే మాకు అనుభవం, నాణ్యత రెండూ ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్ రైనా. పరుగుల వీరుల్లో రెండో స్థానం. ఎడారి, పొడి వాతవరణం, స్పిన్కు సహకరించే పిచ్లపై అతడు చెలరేగుతాడు. రెండేళ్లుగా భజ్జీ కీలకంగా ఉంటున్నాడు. వారిద్దరూ లేకపోవడం కచ్చితంగా లోటే’ అని వాట్సన్ అన్నాడు.
‘నాలుగేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ లీగులు ఆడుతున్నాను. సవాళ్లు విసిరే పరిస్థితుల్లో నైపుణ్యాలను ఎలా ప్రదర్శించాలో నాకిప్పుడు అర్థమైంది. 2018లో ఫైనల్లోనే కాకుండా టోర్నీ సాంతం బాగా ఆడాను. 2019లో అంత బాగా ఆడలేదు. అయినప్పటికీ సీఎస్కేలోని గొప్ప నాయకత్వ బృందం నాకు అండగా నిలిచింది. వరుసగా అవకాశాలు ఇచ్చింది. నాపై ఆత్మవిశ్వాసం ఉంచింది. అదే వేరే జట్టైతే పక్కన కూర్చోబెట్టేది. సీనియర్ ఆటగాడు మురళీ విజయ్ అద్భుతమైన బ్యాట్స్మన్. గతేడాది ఎక్కువగా బెంచ్కే పరిమితం అయ్యాడు. ఈ సారి ఎక్కువ మ్యాచుల్లో ఆడేందుకు అవకాశం ఉంది’ అని వాట్సన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?