మీ సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పలువురు టీమ్ఇండియా ప్రముఖులు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం తెలిపారు...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి క్రికెటర్ల సంతాపం
ఇంటర్నెట్డెస్క్: మాజీ రాష్ట్రపతి, భారత రత్న అత్యున్నత పురస్కార గ్రహీత ప్రణబ్ ముఖర్జీకి పలువురు టీమ్ఇండియా ప్రముఖులు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం తెలిపారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ దిల్లీలోని కంటోన్మెంట్ ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రణబ్ ఆరోగ్యం క్షీణించింది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు శస్త్రచికిత్స కూడా చేశారు. ఈ క్రమంలోనే విషమ పరిస్థితుల్లోకి వెళ్లిన ఆయన సోమవారం సాయంత్రం వేళ తుది శ్వాస విడిచారు.
క్రికెటర్ల స్పందన..
దేశం ఓ గొప్ప లీడర్ను కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి -విరాట్కోహ్లీ
దేశానికే ఆదర్శవంతమైన నేత. ఆయన ఆత్మీయులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. -రోహిత్శర్మ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లేరని తెలిసి చాలా బాధేసింది. పలు దశాబ్దాల పాటు ఆయన దేశానికి ఉత్తమ సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. -సచిన్ తెందూల్కర్
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల బాధాతప్త హృదయంతో నివాళులర్పిస్తున్నా. ఓం శాంతి -వీరేంద్ర సెహ్వాగ్
ఈ వార్త తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యా. గౌరవనీయులైన నాయకుల్లో ఆయన ఒకరు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తినివ్వాలి. ఆయన సేవలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -గౌతమ్ గంభీర్
మాజీ రాష్ట్రపతి మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రణబ్ జీ మీరు చేసిన సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. -రవిశాస్త్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!