టెస్టు సిరీస్కు ముందే ఆసీస్కు షాక్
ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. తొడకండరాల గాయంతో భారత్తో ఆఖరి వన్డే, టీ20 సిరీస్కు దూరమైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి టెస్టుకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
అడిలైడ్ డే/నైట్ టెస్టుకు వార్నర్ దూరం
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. తొడకండరాల గాయంతో భారత్తో ఆఖరి వన్డే, టీ20 సిరీస్కు దూరమైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి టెస్టుకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా వెల్లడించింది. డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది. అయితే, పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో పది రోజుల సమయం పడుతుందని వార్నర్ తెలిపాడు. మెల్బోర్న్ వేదికగా జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండాలని ప్రయత్నిస్తున్నాడు.
‘‘గాయం నుంచి దాదాపు కోలుకున్నా. అయితే టెస్టు మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా 100 శాతం ఫిట్గా ఉండాలని భావిస్తున్నా. బరిలోకి దిగినప్పుడు వికెట్ల మధ్య పరుగెత్తడంలో, మైదానంలో చురుకుగా ఉండాలి. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో 10 రోజులు పడుతుంది’’ అని డేవిడ్ వార్నర్ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. డేవిడ్ గాయం గురించి ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. అతడు మెల్బోర్న్ టెస్టుకు పూర్తిఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
డే/నైట్ టెస్టుకు ఫామ్లో ఉన్న వార్నర్ దూరం కావడం ఆస్ట్రేలియాకు ప్రతికూలాంశమే. పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. గులాబి బంతితో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించే డే/నైట్ మ్యాచ్లో అనుభవజ్ఞుడు వార్నర్ జట్టును బలోపేతం చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఆసీస్ యువ ఓపెనర్ విల్ పకోస్కీ కూడా కంకషన్కు గురికావడం ఆ జట్టును కలవరపెడుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్లో కార్తీక్ త్యాగి విసిరిన బౌన్సర్ అతడి హెల్మెట్కు తాకింది. అతడిలో కంకషన్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో డిసెంబర్ 11 నుంచి జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్కు దూరమయ్యాడు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి