విరాట్కు పోటీయా! వార్నర్ ప్రశంసలివి
ఐసీసీ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలిచిన టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ రెండు పురస్కారాలకు అతడు అర్హుడని తెలిపాడు. ఎవరేమన్నా తమ తరంలో అత్యుత్తమ ఆటగాడు అతడేనని స్పష్టం చేశాడు. విరాట్కు వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు....
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలిచిన టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ రెండు పురస్కారాలకు అతడు అర్హుడని తెలిపాడు. ఎవరేమన్నా తమ తరంలో అత్యుత్తమ ఆటగాడు అతడేనని స్పష్టం చేశాడు. విరాట్కు వినూత్నంగా అభినందనలు తెలియజేశాడు.
ఐసీసీ పురస్కారాల్లో కోహ్లీ దుమ్మురేపాడు. ఈ దశాబ్దపు వన్డే ఆటగాడు, ఈ దశాబ్దపు సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ పురుష క్రికెటర్ పురస్కారాలను సొంత చేసుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా అతడిపై అనేకమంది అభిందనల జల్లు కురిపిస్తున్నారు. వార్నర్ సైతం వారితో జత కలిశాడు. విరాట్ కోహ్లీ వీడియోకు తన ఫేస్స్వాప్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ‘ఈ దశాబ్దపు ఆటగాడిని ఎవరూ గుర్తుపట్టలేరు. విరాట్ కోహ్లీకి అభినందనలు. నువ్వో సీరియస్ ఆటగాడివి. ఈ పురస్కారాలకు అర్హుడివి’ అని వ్యాఖ్య జత చేశాడు.
వార్నర్ పెట్టిన పోస్టుకు అభిమానుల నుంచి విపరీతంగా స్పందన లభించింది. గంటలోపే లక్షకు పైగా వీక్షణలు లభించాయి. కొందరైతే ప్రశ్నలు సంధించారు. పురస్కారాలు రానందుకు మీకు అసంతృప్తిగా లేదా అని ప్రశ్నించగా ‘అతడి (విరాట్)తో ఎవ్వరూ పోటీ పడలేరు’ అని జవాబిచ్చి మనసులు గెలిచాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నేనిది చేయాల్సింది. కానీ అతడు మా తరంలోనే అత్యుత్తమ ఆటగాడు’ అని స్పష్టం చేశాడు. కాగా తన సహచరుడు స్టీవ్స్మిత్ ఐసీసీ ఈ దశాబ్దపు టెస్టు ఆటగాడి అవార్డు గెలిచిన సంగతి తెలిసిందే. వార్నర్కు ఏ పురస్కారమూ రాకపోయినా ఐసీసీ ఈ దశాబ్దపు టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఇవీ చదవండి
ధోనీకి అవార్డు తెచ్చిన సంఘటన ఇదే!
కోహ్లీ, ధోనీకి ప్రతిష్ఠాత్మక అవార్డులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.