ఫైనల్‌: బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ

గత 52 రోజులగా క్రికెట్‌ అభిమానులకు ఎంతో వినోదాన్నిచ్చిన టీ20 లీగ్‌ అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఫైనల్లో దుబాయ్ వేదికగా ముంబయి×దిల్లీ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన దిల్లీ బ్యాటింగ్‌ ...

Updated : 10 Nov 2020 19:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత 52 రోజులగా క్రికెట్‌ అభిమానులకు ఎంతో వినోదాన్నిచ్చిన టీ20 లీగ్‌ అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఫైనల్లో దుబాయ్ వేదికగా ముంబయి×దిల్లీ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన దిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే నాలుగు టైటిళ్లు సాధించిన ముంబయి మరో ట్రోఫీ మీద కన్నేయగా, తొలిసారి ఫైనల్‌కు చేరిన దిల్లీ కప్‌ను ముద్దాడాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా రోహిత్‌సేనదే పైచేయి.

జట్ల వివరాలు

ముంబయి: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌, కృనాల్‌, జయంత్‌ యాదవ్‌, బుమ్రా, బౌల్ట్‌, కౌల్టర్‌నైల్‌

దిల్లీ: శిఖర్‌ ధావన్‌, స్టాయినిస్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రహానె, పంత్‌, హెట్‌మైయర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ప్రవీణ్‌ దూబె, నోర్జె‌, రబాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని