రైనా.. షాహిద్ అఫ్రిదీలా చెయ్
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తాను కూడా వీడ్కోలు పలికిన సురేశ్ రైనా మరింత కాలం ఆడాల్సి ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడిది రిటైర్మెంట్ ప్రకటించే వయసు కాదన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా మరింత కాలం ఆడాల్సి ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడిది రిటైర్మెంట్ ప్రకటించే వయసు కాదన్నాడు. తాజాగా అతడిని యూట్యూబ్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. ‘రైనా ఇంకా ఆడాల్సి ఉందా?’ అని అభిమాని అడగ్గా.. కచ్చితంగా అతడు చాలా ఆడాల్సి ఉందని, ఇప్పుడు వీడ్కోలు పలికే అవసరమే లేదని మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. రైనాకిప్పుడు 33 ఏళ్లే అని, అతడికి గాయాల సమస్యలున్నా.. ఏ ఆటగాడికి లేవని ప్రశ్నించాడు. సర్జరీ అయ్యాక అతడింకా అత్యుత్తమంగా తయారయ్యాడని, ఫిట్నెస్ విషయంలోనూ మెరుగయ్యాడని తెలిపాడు.
అలాగే ధోనీ గురించి ప్రస్తావిస్తూ.. అతడిది వేరే పరిస్థితని ఆకాశ్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ అనుకున్నట్లే ఐపీఎల్ ఏప్రిల్, మేలో జరిగి.. అక్టోబర్-నవంబర్లో టీ20 ప్రపంచకప్ జరిగి ఉంటే రిటైర్మెంట్ ప్రకటించకపోయేవాడని ఆకాశ్ చోప్రా అన్నాడు. అవి వాయిదా పడడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. రైనాకు అలాంటి ఇబ్బందులేం లేవని, అతడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీలా రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని సూచించాడు. 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో రాణిస్తే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జట్టులో అతడు చోటు దక్కించుకునేవాడని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.