ధోనీ.. ఇవి చిరకాలం మా వెంటే..
టీమ్ఇండియా మాజీ సారథి, బ్యాట్స్మన్ మహేంద్రసింగ్ ధోనీ తిరిగి ఎప్పుడెప్పుడు జట్టులోకి వస్తాడా అని ఆశిస్తుండగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు...
మహీ బ్యాట్ నుంచి జాలువారిన ఆణిముత్యాలు
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ తిరిగి ఎప్పుడెప్పుడు జట్టులోకి వస్తాడా అని ఆశిస్తుండగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏడాది కాలంగా ఆటకు దూరమైనా ఈసారి ఐపీఎల్లో రాణించి మళ్లీ భారత జెర్సీ ధరిస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మరో ఏడాది ఆడినా ఇంకో టీ20 ప్రపంచకప్ అందిస్తాడనే గంపెడాశలు రేకిత్తిన వేళ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కానీ, మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది. అదేంటంటే.. మహీ ఇప్పటికే టీమ్ఇండియాకు ఎంతో చేశాడు. విశ్వవేదికపై అతడు సాధించలేనిది ఏదీ లేని విధంగా చరిత్ర పుటల్లో నిలిచాడు. ఇప్పటివరకూ ఏ జట్టు సారథికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు అందుకున్నాడు. ఉన్నతమైన ఆటగాడిగానే కాకుండా అత్యున్నతమైన వ్యక్తిగా ప్రత్యేకత సాధించాడు. ఈ క్రమంలో ఆడాలని అనిపించినన్ని రోజులు ఆడేశాడు. ఇక ఏదో ఒకరోజు తప్పుకోక తప్పదని స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేదికగా మలచుకున్నాడు.
ధోనీ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండే ఇన్నింగ్స్:
*2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ 91*
శ్రీలంకతో టీమ్ఇండియా ఆడిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ను ఏ భారతీయుడూ మరిచిపోడు. ఆ మ్యాచ్లో ధోనీ(91 నాటౌట్; 79 బంతుల్లో 8x4, 2x6) ఆడిన ఇన్నింగ్స్.. చివర్లో కొట్టిన సిక్స్.. ఇంకా అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉన్నాయి. అలాంటి ఉత్కంఠభరితమైన పోరులో ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగా లాంటి దిగ్గజాలను తట్టుకొని నిలిచాడంటే సాహసమే. గంభీర్(97)తో కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపించినా, చివర్లో యువీ(21)తో కలిసి మ్యాచ్ను ముగించినా అది మహేంద్రుడికే దక్కింది. అందుకే అది ప్రత్యేకమైంది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
*అదే లంకపై తొలిసారి చెలరేగి 183*
2005లో అదే శ్రీలంక జట్టుకు మహీ తొలిసారి చుక్కలు చూపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో, మైమరపించే షాట్లతో కేరింతలు కొట్టించాడు. ఏడు వన్డేల సిరీస్లో భాగంగా లంక జట్టు భారత్లో పర్యటించింది. అంతకుముందే పాకిస్థాన్కు విశ్వరూపం చూపించిన మహీ ఈ మ్యాచ్లో తనలోని ఉగ్రరూపాన్ని పరిచయం చేశాడు. జైపుర్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో తన వన్డే కెరీర్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ (183 నాటౌట్; 145 బంతుల్లో 15x4, 10x6) బాదాడు. దీంతో లంక నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేశాడు.
*తొలి శతకంతోనే పాకిస్థాన్కు వణుకు 148
బంగ్లాదేశ్తో తొలి సిరీస్లో రాణించలేకపోయిన అప్పటి జుంపాల జట్టు ఆటగాడు తర్వాత పాకిస్థాన్ వెన్నులో వణుకుపుట్టించాడు. భారత్లో లంక సిరీస్కు ముందే టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థి అయిన దాయాది దేశంతో ఐదు వన్డేల సిరీస్ ఆడింది. ఇక విశాఖలో జరిగిన రెండో వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 356/9 భారీ స్కోర్ సాధించింది. సాగర తీరాన మహీ(148; 123 బంతుల్లో 15x4, 4x6) చిన్నపాటి సునామీని తలపించాడు. ఆ మ్యాచ్తోనే ధోనీ అంటే ఏంటో క్రికెట్ ప్రపంచానికి అర్థమైంది. ఈ శతకమే అతడి గమనాన్ని, ప్రయాణాన్ని నిర్దేశించింది. ఎప్పటికీ ఇది ప్రత్యేకమే. అభిమానులెప్పుడూ వీటిని మర్చిపోరు. ఈ మధురానుభూతులు ఇచ్చినందుకు థాంక్యూ డియర్ ఎంఎస్డీ..
-ఇంటర్నెట్డెస్క్
ఎం.ఎస్.ధోనీ రిటైర్మెంట్కు సంబంధించిన మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.. -
సిరాజ్ మియా.. ఎక్కడ బౌలింగ్ మాయ..? తేలిపోతున్న బెంగళూరు పేస్ ఎటాక్!
భారత స్టార్ పేసర్గా మారిన సిరాజ్ (Siraj) తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి బౌలింగ్ను తేలిగ్గా ఆడేస్తున్నారు. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్ మలుపు తిరిగింది. -
ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. -
Bengaluru Vs Punjab: సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?
ఐపీఎల్లో బెంగళూరు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్తో తలపడనుంది. -
Mumbai Indians: వరుసగా 12వ సారి.. ముంబయి తొలి మ్యాచ్ల చరిత్ర ఎలా ఉందంటే..?
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్లో గుజరాత్పై ఓటమిపాలైంది. ఇలా ఓటమితో సీజన్ను ప్రారంభించడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM