ఇప్పుడైనా ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?
రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫిట్నెస్ పరీక్షలు పాసవ్వడంతో ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి. శుక్రవారం బెంగళూరులోని ఎన్సీఏలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రోహిత్ ఫిట్నెస్...
కోహ్లీ గైర్హాజరీలో రోహిత్కు మంచి అవకాశం..
రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్షలు పాసవ్వడంతో ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి. శుక్రవారం బెంగళూరులోని ఎన్సీఏలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రోహిత్ ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి ఆస్ట్రేలియా పర్యటనపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టు తర్వాత తిరిగి భారత్కు వస్తున్న నేపథ్యంలో సీనియర్ బ్యాట్స్మన్ జట్టులో చేరడం ఎంతైనా అవసరం. మరి ఈ అవకాశాన్ని హిట్మ్యాన్ సద్వినియోగం చేసుకుంటాడా లేదా వేచిచూడాలి. అలాగే రోహిత్ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై వన్డేల్లో చెలరేగినట్లు టెస్ట్టుల్లో రాణించలేకపోయాడు. ఇప్పుడైనా తన బ్యాట్ ఝుళిపించి కొత్త రికార్డులు నమోదు చేస్తాడేమో చూడాలి.
ఆస్ట్రేలియాపై అదే అత్యధిక స్కోర్..
ఈ ముంబయి బ్యాట్స్మన్ గత ఆస్ట్రేలియా పర్యటన 2018-19లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అప్పుడతడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో (37, 1) పరుగులే చేయడంతో రెండో టెస్టుకు అతడిని ఎంపిక చేయలేదు టీమ్ఇండియా. మళ్లీ మూడో టెస్టులో అవకాశం ఇవ్వడంతో జాగ్రత్తగా ఆడి తొలి ఇన్నింగ్స్లో (63*; 114 బంతుల్లో 5x4) పరుగులు చేశాడు. దీంతో ఆజట్టుపై అతడికిదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో 5 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు. అయితే, అప్పుడు పుజారా, కెప్టెన్ కోహ్లీ తమ బ్యాటింగ్తో రాణించడంతో భారత్ 2-1 తేడాతో తొలిసారి సిరీస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ గత రికార్డును మెరుగు పర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఓపెనర్గా అదరగొట్టి..
ఆ పర్యటన తర్వాత రోహిత్ 2019లో చెలరేగిపోయాడు. అటు వన్డే ప్రపంచకప్లోనూ ఐదు శతకాలతో రెచ్చిపోయాడు. తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో రెండు శతకాలు, ఒక ద్వితశతకం బాది ఓపెనర్గా కొత్త అవతారం ఎత్తాడు. జట్టు యాజమాన్యం అంచనాలకు మించి రాణించాడు. టెస్టుల్లో మిడిల్ఆర్డర్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగే హిట్మ్యాన్కు టీమ్ఇండియా ఈసారి ఓపెనర్గా అవకాశం ఇచ్చింది. దాంతో స్వేచ్ఛగా పరుగులు చేసి ఇక్కడా రాణించగలనని సత్తా చాటాడు. విశాఖలో జరిగిన తొలి టెస్టులో (176, 127) రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదిన అతడు రాంచీలో జరిగిన మూడో టెస్టులో(212) ఏకంగా డబుల్ సెంచరీ కొట్టాడు. తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు. తర్వాత టీమ్ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో రెండు టెస్టులు ఆడినా రోహిత్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక మళ్లీ ఇప్పుడే టెస్టుల్లో బరిలోకి దిగుతుండడంతో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కంగారూలపై కొత్త రికార్డు సృష్టిస్తాడా?
ఇక 2013 నుంచీ ఈ సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగుతున్న ముంబయి బ్యాట్స్మన్ ఇప్పటివరకు మొత్తం 32 టెస్టులు ఆడాడు. అందులో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్లు ఆడాడు. గతేడాది దక్షిణాఫ్రికాపై బాదిన డబుల్ సెంచరీ(212) టెస్టుల్లో అతడికి అత్యధిక వ్యక్తిగత స్కోర్గా నిలిచింది. అయితే, ఆస్ట్రేలియాపై గతపర్యటనలో చేసిన 63* పరుగులే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక మొత్తంగా టెస్టుల్లో 6 శతకాలు, 10 అర్ధశతకాలు బాదిన అతడు 2,141 పరుగులు చేశాడు. కంగారూలపై 2 అర్ధశతకాలతో 279 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో హిట్మ్యాన్ ఈ పర్యటనలోనైనా కంగారూలపై టెస్టు శతకం బాదడంతోపాటు జట్టును ముందుండు నడిపించాల్సిన అవసరం ఉంది. అలాగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీని నిలబెట్టాలని టీమ్ఇండియా ఆశిస్తోంది.
-ఇంటర్నెట్డెస్క్
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం