పాక్పై ఆ మ్యాచ్లో సచిన్ ఎంత లక్కీనో!!
2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయం సాధించి ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్(85; 115బంతుల్లో 11x4)...
ఆ ఇన్నింగ్స్ను కొనియాడిన నెహ్రా
ఇంటర్నెట్ డెస్క్: 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయం సాధించి ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్(85; 115బంతుల్లో 11x4) బాధ్యతాయుతంగా ఆడి టీమ్ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. లేదంటే జట్టు పరిస్థితి ఘోరంగా ఉండేది. అయితే, అతడు బ్యాటింగ్ చేస్తుండగా అప్పటికే నాలుగు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 27, 45, 70, 81 పరుగుల వద్ద పాక్ ఆటగాళ్ల తప్పులకు బతికిపోయాడు. అయినా చివరికి శతకానికి చేరవైన సమయంలో అజ్మల్ బౌలింగ్లో షాహిద్ అఫ్రిది క్యాచ్ అందుకోవడంతో వెనుతిరిగాడు. తర్వాత టీమ్ఇండియా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖరికి జట్టు స్కోర్ 260/9తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తాజాగా నాటి విశేషాల్ని అప్పటి టీమ్ఇండియా పేసర్ ఆశిష్ నెహ్రా గుర్తుచేసుకున్నాడు. గ్రేటెస్ట్ రైవల్రీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ పాక్పై సచిన్ చెలరేగిన ఆ ఇన్నింగ్స్ను కొనియాడాడు. అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో అదీ ఒకటని చెప్పాడు. ‘ఇప్పుడు ఓ విషయం చెప్పాల్సిన అవసరం లేకున్నా.. చెబుతున్నా. ఆ మ్యాచ్లో పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ రోజు సచిన్ ఎంత అదృష్టవంతుడో అతడికీ తెలుసు. ప్రపంచకప్లో ఒత్తిడి ఉంటుంది. ఏ జట్టు సెమీస్కు చేరినా అది గొప్ప జట్టే’నని వ్యాఖ్యానించాడు. అయితే, ఆటగాళ్లు ఒత్తిడిని జయించడమే ముఖ్యమని నెహ్రా పేర్కొన్నాడు. కాగా, ఆ మ్యాచ్లో ఛేదనకు దిగిన పాకిస్థాన్ 231 పరుగులకే ఆలౌటైంది. తొలుత ఆ జట్టుకు మంచి ఆరంభమే లభించినా తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. మధ్యలో మిస్బాఉల్ హక్(56) ఒంటరి పోరాటం చేసిన అతడికి సహకరించే బ్యాట్స్మెన్ లేక ఆ జట్టు ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..