ENGvsPAK ‘ఫ్లెక్సీ టైం’ ప్లే!
అంతర్జాతీయ క్రికెట్ను నిర్విరామంగా కొనసాగించేందుకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సరికొత్త మార్గాలు అన్వేషిస్తోంది. పాకిస్థాన్తో మూడో టెస్టు సవ్యంగా సాగేందుకు ‘ఫ్లెక్సీ టైమ్’ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించింది. వాతావరణాన్ని బట్టి నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందే...
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ను నిర్విరామంగా కొనసాగించేందుకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సరికొత్త మార్గాలు అన్వేషిస్తోంది. పాకిస్థాన్తో మూడో టెస్టు సవ్యంగా సాగేందుకు ‘ఫ్లెక్సీ టైమ్’ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించింది. వాతావరణాన్ని బట్టి నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందే ఆటను మొదలు పెట్టనున్నారు. ఇందుకు రెండు జట్ల సారథులు, కోచ్లు అంగీకరించారని తెలిసింది.
కరోనా వైరస్ మహమ్మారి మొదలైన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ను మొదలుపెట్టిన తొలిదేశం ఇంగ్లాండ్. బయో బుడగను సృష్టించి వెస్టిండీస్తో సుదీర్ఘ ఫార్మాట్ ఆడింది. సిరీస్ను కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో పాకిస్థాన్ను ఎదుర్కొంటోంది. మూడు టెస్టుల సిరీసులో ఒక మ్యాచ్ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో టెస్టు వర్షార్పణం అయింది. ఐదురోజుల్లో మూడున్నర రోజులు ఆడేందుకు కుదర్లేదు. మొత్తంగా 134.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. డ్రా కావడంతో పాక్ సంతోషించినా ఆతిథ్య జట్టుకు అసంతృప్తే మిగిలింది. ఎందుకంటే ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వాతావరణం అనుకూలించనప్పటికీ సంప్రదాయ పద్ధతిలో నిర్దేశిత సమయాల్లోనే మ్యాచులు మొదలు పెట్టడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టేడియాలకు అభిమానులను అనుమతించడం లేదు. ప్రయాణం చేయాల్సిన పనిలేదు. దీంతో పరిస్థితులను బట్టి అరగంట ముందుగానే మ్యాచ్ ఆరంభించేందుకు ఐసీసీతో ఈసీబీ చర్చలు జరిపింది. రెండు జట్ల సారథులు, కోచ్లకు వివరించింది. అందుకు వారూ అంగీకరించారు. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు ఆట మొదలవుతుంది. ఒకవేళ పరిస్థితి బాగాలేకుంటే 10:30 గంటలకే ఆటగాళ్లు మైదానంలోకి వచ్చేస్తారు. అయితే తొలిరోజు ఆట ముగిశాక రిఫరీతో మాట్లాడి తర్వాతి రోజు సమయాన్ని నిర్దేశిస్తారు. తుది నిర్ణయం మాత్రం రిఫరీదే.
రోజుకు 98 ఓవర్ల ఆట సాగాలి. సాధారణంగా ఆటను సాయంత్రం 6 గంటల్లోపు ముగించాలి. అత్యవసర పరిస్థితుల్లో 6:30 గంటల వరకు పెంచుతారు. వాతావరణం అనుకూలించడం లేదు కాబట్టి ఇప్పుడా ముగింపు (కటాఫ్) సమయాన్ని రాత్రి 7 గంటల వరకు పొడగించారు. ఒకవేళ మ్యాచ్ అరగంట ముందుగానే మొదలైతే తొలి సెషన్ రెండున్నర గంటలు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం