అలాంటి అవకాశాలు వదులుకోవాల్సినవి కావు
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో తలపడిన తొలి టెస్టులో పాకిస్థాన్ గెలిచే అవకాశం ఉన్నా కీలక సమయంలో వికెట్లు పడగొట్టలేక చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటకు వర్షం...
పాక్ జట్టుపై మాజీ ఆటగాళ్ల అసంతృప్తి
ఇంటర్నెట్డెస్క్: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో తలపడిన తొలి టెస్టులో పాకిస్థాన్ గెలిచే అవకాశం ఉన్నా కీలక సమయంలో వికెట్లు పడగొట్టలేక చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించినా నాలుగో రోజే ఇంగ్లాండ్ విజేతగా నిలవడం విశేషం. అయితే, ఈ మ్యాచ్లో పాకిస్థాన్ గెలవాల్సి ఉన్నా చేజేతులా మ్యాచ్ను ఆతిథ్య జట్టుకు అప్పగించింది. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు బౌలర్లు 117 పరుగులకే సగం ఇంగ్లీష్ జట్టును పెవిలియన్కు పంపినా, తర్వాత ఆడిన క్రిస్వోక్స్(84*), జాస్ బట్లర్(75)లను అడ్డుకోలేకపోయింది. అలా పాక్ ఓటమి పాలుకావడంతో మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం వసీమ్ అక్రమ్ ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ కెప్టెన్ అజర్ అలీ నాయకత్వ నిర్ణయాలను తప్పుబట్టాడు. అతడు కొన్ని అవకాశాలు జారవిడిచాడని, ఈ ఓటమితో పాక్ అభిమానులు బాధపడ్డారని చెప్పాడు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా కెప్టెన్గా అజర్ విఫలమయ్యాడన్నాడు.
యువ బౌలర్లు షాహీన్ అఫ్రిది, నసీమ్ షాలకు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ ఇవ్వలేదని, దాంతో వోక్స్, బట్లర్ తేలిగ్గా పరుగులు చేయగలిగారని చెప్పాడు. ఇదే విషయంపై మాజీ సారథి షాహిద్ అఫ్రిది ట్వీట్ చేస్తూ తొలుత ఇంగ్లాండ్ గెలిచినందుకు అభినందనలు చెప్పాడు. తమ జట్టుకు గెలిచే అవకాశం ఉన్నా దురదృష్టవశాత్తూ ఓడిపోయిందని, అలాంటి అవకాశాలు వృథా చేసుకోవాల్సినవి కాదన్నాడు. అలాగే మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ను 219 పరుగులకే ఆలౌట్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి పాకిస్థాన్కు 107 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోవడంతో పాక్ రెండో ఇన్నింగ్స్లో 169 పరుగులే చేసింది. అయినా ఇంగ్లాండ్ ముందు 277 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఆతిథ్య జట్టు బ్యాటింగ్ చేస్తుండగా 117 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అప్పుడే బట్లర్, వోక్స్ ఆరో వికెట్కు 139 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్