వైరస్ పెరుగుతోంటే స్టేడియాల్లోకి ఫ్యాన్స్
ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడలను నిర్వహించడమే కత్తిమీద సాము. ఇక బయో బుడగను సృష్టించడం అంతకు మించి కష్టం. అలాంటి ఓ పక్కన వైరస్ కేసులు పెరుగుతోంటే స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తామని షాకిచ్చారు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు. అంతేకాకుండా అంతర్జాతీయ సర్క్యూట్..
ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులపై విమర్శలు
ప్యారిస్: ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడలను నిర్వహించడమే కత్తిమీద సాము. ఇక బయో బుడగను సృష్టించడం అంతకు మించి కష్టం. అలాంటి ఓ పక్కన వైరస్ కేసులు పెరుగుతోంటే స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తామని షాకిచ్చారు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు. అంతేకాకుండా అంతర్జాతీయ సర్క్యూట్ ఆరంభమయ్యాక అభిమానులను అనుమతించిన మొదటి టోర్నీ తమదేనని గొప్పగా చెబుతున్నారు. క్రీడాకారులు సహా అనేక మంది ఈ నిర్ణయాన్ని విమర్శిస్తుండటం గమనార్హం.
కరోనా వైరస్ కారణంగానే మే నెల్లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడటంతో సెప్టెంబర్ 27 నుంచి టోర్నీ ఆరంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే అభిమానులను అనుమతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు గ్రాండ్స్లామ్లు ఆడేందుకు నిరాకరిస్తున్నారు. యూఎస్ ఓపెన్లో చాలామంది ఆడలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆష్ బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడనని ప్రకటించేసింది.
‘యూఎస్ ఓపెన్ ముగిసిన కొన్నాళ్లకే ఎర్రమట్టి కోర్టుల్లో సమరాలు మొదలవ్వనున్నాయి. అంతర్జాతీయ సర్క్యూట్ ఆరంభమైన తర్వాత అభిమానులను అనుమతించిన తొలి టోర్నీ రొలాండ్ గ్యారోస్ మాత్రమే’ అని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ గిడిసెల్లి సోమవారం ప్రకటించారు. అయితే సమాఖ్య నిర్ణయంలో అర్థం లేదని గ్రీక్ టెన్నిక్ క్రీడాకారిణి మరియా సక్కారి విమర్శించింది. అభిమానులతో బయో బుడగ ఎలా సృష్టిస్తారని ప్రశ్నించింది.
స్టేడియం సామర్థ్యంలో 50-60 శాతం మందిని అనుమతించాలని నిర్వాహకులు తొలుత భావించారు. అంటే రోజుకు దాదాపుగా 20 వేల మంది అన్నమాట. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం కేవలం 5000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో ప్రణాళికల్లో మార్పు చేశారు. మొత్తం మూడు జోన్లుగా విభజించారు. ప్రధాన కోర్టులున్న ఫిలిఫ్ ఛాట్రూయిర్, సుజన్ లెగ్లెన్ ప్రాంగణాల్లో 5000 చొప్పున అనుమతిస్తారు. ఆ తర్వాత పెద్దదైన మూడో కోర్టులో 1500 మందికే ప్రవేశం కల్పిస్తున్నారు. అభిమానులకు కచ్చితంగా మాస్క్ ధరించాలని, వైరస్ టెస్టులు చేయించుకోవాలని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.