తండ్రి కల నెరవేరింది.. సిరాజ్ భావోద్వేగం
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా విధి అతడిని పరీక్షించింది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్లో...
ఇంటర్నెట్డెస్క్: హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా విధి అతడిని పరీక్షించింది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్లో ఉన్న సమయంలో సిరాజ్ తండ్రి అనారోగ్యంతో మరణించారు. భారత్కు వెళ్లి వస్తే క్వారంటైన్ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అంత్యక్రియలకు హాజరుకాలేదు. భారత్ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలనుకున్న తన తండ్రి కల కోసం.. బాధను భరిస్తూ ఆసీస్లోనే ఉండిపోయాడు. కానీ తొలి టెస్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే, షమి గాయంతో బాక్సింగ్ డే టెస్టులో చోటు సంపాదించాడు.
రెండో టెస్టు తొలి రోజు ఆటలో సిరాజ్ బౌలింగ్ చేయడానికి ఎంతో సమయం పట్టింది. కెప్టెన్ రహానె వ్యూహాల్లో భాగంగా తొలి సెషన్ అనంతరం బంతిని అందుకున్నాడు. ఆలస్యంగా బౌలింగ్కు వచ్చినా రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఆసీస్ కీలక ఆటగాళ్లు లబుషేన్, గ్రీన్ను తెలివిగా బోల్తాకొట్టించి భారత్ పైచేయి సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సిరాజ్ తొలి వికెట్ సాధించిన అనంతరం ఆకాశం వైపు చేతులు చూపిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
తొలి రోజు ఆట ముగిసిన అనంతరం సిరాజ్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా క్యాప్ను అందుకున్న తర్వాత నా జీవితంలో విలువైనది సాధించనట్లుగా అనిపించింది. రహానె, బుమ్రాతో మాట్లాడిన అనంతరం ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే మైదానంలోకి వచ్చిన తర్వాత బౌలింగ్ చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూశాను. కానీ లంచ్ తర్వాత నేను బౌలింగ్ చేయాలని రహానె చెప్పాడు. ఎందుకంటే పిచ్పై తేమ ఉండటంతో స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. లంచ్ విరామం తర్వాత పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. దీంతో డాట్ బాల్స్ వేస్తూ బ్యాట్స్మెన్పై ఒత్తిడి తీసుకురావాలని భావించా’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.
సిరాజ్ అరంగేట్రం గురించి అతడి సోదరుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ..‘‘భారత్ తరఫున సిరాజ్ టెస్టుల్లో, వన్డేల్లో ఆడాలన్నది మా నాన్న కల. అది ఈ రోజు నెరవేరింది. అయితే రెండో టెస్టు జట్టులో సిరాజ్ పేరు ప్రకటించిన అనంతరం మాకు నిద్ర పట్టలేదు. సిరాజ్ ప్రదర్శన చూడటానికి రాత్రంతా ఆశగా ఎదురుచూశాం. ఉదయం నాలుగు గంటలకి టీవీ ఆన్ చేసి అతడి బౌలింగ్ కోసం ఎదురుచూడటం ప్రారంభించాం. కానీ ఎంతో సేపు తర్వాత తొలి ఓవర్ వేశాడు’’ అని చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?