రాహుల్‌.. కోహ్లీ ‘కొత్త నిబంధనలు’

టీ20 క్రికెట్‌లో ఏదైనా కొత్త నిబంధన తీసుకువచ్చే అవకాశం మీకిస్తే మీరేం చేస్తారు.? అనే అంశంపై కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ మధ్య వీడియో సంభాషణ జరిగింది. కోహ్లీ ఓ సూచన చేయగా.. రాహుల్‌ మాత్రం వింత కోరిక కోరాడు. టీ20 లీగ్‌ నుంచి బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ,

Published : 16 Oct 2020 02:23 IST

(Photo: Rahul twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌లో ఏదైనా కొత్త నిబంధన తీసుకువచ్చే అవకాశం మీకిస్తే మీరేం చేస్తారు.? అనే అంశంపై కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ మధ్య వీడియో సంభాషణ జరిగింది. కోహ్లీ ఓ సూచన చేయగా.. రాహుల్‌ మాత్రం వింత కోరిక కోరాడు. టీ20 లీగ్‌ నుంచి బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను నిషేధించాలని పంజాబ్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ కోరాడు(సరదాగా). ‘నేనైతే విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ ఇద్దరినీ టీ20 లీగ్‌ వచ్చే సీజన్‌ నుంచి నిషేధించాలని బీసీసీఐని కోరతా. మీరు ఇప్పటికే క్రికెట్‌లో చాలా సాధించారు. మిగతా వాళ్లకు కూడా ఎంతో కొంత మిగల్చండి’ అని రాహుల్‌ సరాదాగా అన్నాడు. కొత్త నిబంధన గురించి మాట్లాడుతూ.. 100మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లిన సిక్సర్‌కు అదనపు పరుగులు ఇవ్వాలని రాహుల్‌ కోరాడు.

(Photo: Kohli twitter)

అయితే.. కోహ్లీ స్పందిస్తూ.. ‘రాహుల్‌ సూచించిన అదనపు పరుగుల నిబంధనకు నేను సమ్మతిస్తే.. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిన తర్వాత మా బౌలర్ల చేతిలో నా పని అయిపోయినట్లే’ అని కోహ్లీ పేర్కొన్నాడు(నవ్వుతూ). కొత్త నిబంధన తీసుకొచ్చే అవకాశం ఉంటే.. ‘మ్యాచ్‌ సందర్భంగా వైడ్‌ లేదా నోబాల్‌ విషయంలో రివ్యూ తీసుకునే అవకాశం ఆటగాళ్లకు ఇవ్వాలి’ అని కోహ్లీ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని