మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
ఐసీసీ 2022 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ స్వయంగా ట్విటర్లో ఆ సమాచారం పంచుకుంది. మొత్తం 8 జట్లు 31 రోజులు, 31 మ్యాచ్లు ఆడనున్నట్లు తెలిపింది...
ఇంటర్నెట్డెస్క్: ఐసీసీ 2022 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ స్వయంగా ట్విటర్లో ఆ సమాచారం పంచుకుంది. మొత్తం 8 జట్లు 31 రోజులు, 31 మ్యాచ్లు ఆడనున్నట్లు తెలిపింది. న్యూజిలాండ్ వేదికగా 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆరు మైదానాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు చెప్పింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ తొలి క్వాలిఫయర్ జట్టుతో తలపడనుందని స్పష్టం చేసింది. ఆక్లాండ్, తారంగా, హామిల్టన్, వెల్లింగ్టన్, క్రైస్ట్చర్చ్, డునెదిన్ వేదికల్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు వివరించింది.
మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల పొట్టి ప్రపంచకప్ టోర్నీకి విశేషమైన ఆదరణ లభించింది. ఈ టోర్నీలో భారత్ టాప్ ఫేవరెట్గా బరిలోకి దిగగా ఫైనల్లో ఆతిథ్య జట్టు చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో దూసుకెళ్లిన హర్మన్ప్రీత్ సేన తుదిపోరులో చేతులెత్తేసింది. దీంతో తొలిసారి పొట్టి ప్రపంచకప్ సాధించాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. మార్చి 8న మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్కు ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సుమారు 86 వేల మంది హాజరయ్యారు. అలాగే డిజిటల్ మాధ్యమాల్లోనూ రికార్డు స్థాయిలో వీక్షించారు. దీంతో మహిళల క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దొరికింది. ఇక 2022లో వీక్షకుల సంఖ్య ఏమేరకు చేరుతుందో చూడాలి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?